రాజకీయ నాయకుల జీవితకాల అనర్హత నిషేదం కేసును ఇవాళ విచారిస్తామని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్), ఎన్నికల చట్టం 2017కి సవరణ ప్రకారం అనర్హత కాలానికి సంబంధించిన అన్ని వివాదాలను చీఫ్ జస్టిస్ ఖాజీ ఇసా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది.
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ రూల్ నిన్నటి (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్లెస్ డ్రెస్లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరమంటే డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి 12 గంటలు దాటుతున్న టైంలో సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఆ సమయంలో ప్రపంచమంతా ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్తారు.
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. 2023 నవంబర్ 1 నుంచి -30వ తేదీ మధ్య 71 లక్షల 96 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా తెలిపింది.
30వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ్టి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఈ బాండ్లను ప్రవేశ పెట్టింది.
ప్రాణ ప్రతిష్ట వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) ధరంపాల్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.
నూతన సంవత్సరంలో విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో టీమిండియా మహిళల జట్టు భావిస్తుంది. ఇవాళ ఆస్ట్రేలియా మహిళలలో జరిగే చివరి వన్డేలో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది.
తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 1న ఇవాళ (సోమవారం) రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభించారు.
ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది.