Seema Haider: అయోధ్య వరకు సీమా హైదర్ పాదయాత్ర.. సీఎం యోగికి అభ్యర్థన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేసేందుకు రెడీ ఉన్నట్లు ప్రకటించింది. ఇందు కోసం ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్పై ప్రేమతో పాకిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన సీమా హైదర్ తాను కృష్ణుడి భక్తురాలి అని చెప్పుకొచ్చింది. నిన్న (ఫిబ్రవరి 14న) ఆమె సుందరకాండ పఠిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను పూర్తి హిందువుగా మారినట్లు సీమా హైదర్ వెల్లడించింది. పాకిస్థాన్లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అని తెలిపింది.
Read Also: TS Polycet 2024: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
కాగా, సీమాహైదర్కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే, సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా భారత్ లోకి అక్రమంగా తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్తో కలిసి జీవనం కొనసాగిస్తుంది. తాను కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను.. ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కావాలని సీమా హైదర్ కోరింది. ఇక, సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్ ట్రై చేస్తున్నారు.
Read Also: HCL : మూడు రోజుల ఆఫీసుకు రావాల్సిందే.. లేకపోతే చర్యలు తప్పవు
ఇక, సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కాబోతుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు అందరితో కలిసి అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకుంటాను అని సీమా హైదర్ మీడియాకు చెప్పింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టేందుకు రెడీగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!