నేడు గాంధీభవన్లో మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్సభ నియో జకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది.
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది. రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నారు.
భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్నంత కాలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడవు అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్థాన్తో ఎలాంటి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకోవడం లేదు అని ఆయన చెప్పారు.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా డ్రాగన్ కంట్రీ చైనా పేరుగాంచింది. అయితే, గత కొంతకాలంగా చైనా ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. కరోనా అధ్యాయం ముగిసిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ దేశ అగ్రనాయకత్వం వెల్లడించారు.
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు ఇళ్లు దగ్ధం కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు.
పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది.
17 డిగ్రీస్ నార్త్ ఆధ్వర్యంలోని పైరేట్-ఇన్ఫ్యూజ్డ్ న్యూ ఇయర్ పార్టీ ఉత్సాహభరితమైన వాతావరణంలో విజయవంతమైన ఏడాదికి ముగింపు పలుకుతూ సరికొత్తగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించింది.
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ భారత గూఢచార సంస్థ RAWపై సంచలన ఆరోపణలు చేశారు. బలూచిస్థాన్కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే ఛాన్స్ ఉందన్నారు.