ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లపై కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వార్నింగ్ ఇచ్చారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్ పోల్ ప్యానెల్ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది.
పీఓకేపై తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్లో భాగమన్నారు. కాబట్టి, అక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ మా దేశ ప్రజలేనంటూ పేర్కొన్నారు.
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ (శనివారం) వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ను ప్రకటించనుంది.
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారతీయ- అమెరికన్ల బృందం న్యాయ శాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ), పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా మట్టిని ఉపయోగిస్తోందని చెప్పారు. కాలిఫోర్నియాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై న్యాయ శాఖ, ఎఫ్బీఐ, స్థానిక పోలీసుల సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశమైంది.
100 రోజుల పరిపాలన పై ప్రజలు పండుగ చేసుకోవాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడంలో విఫలమైంది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగిస్తుందన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను కోర్టు మార్చి 19న విచారించనుంది. CAA కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేసిన ఒక రోజు తర్వాత, కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాని ఆశ్రయించింది.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' అనే అంశంపై ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం నాడు సమర్పించింది. ఈ నివేదికలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే భావనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల జాబితా కూడా ఉంది.
అకాలీదళ్ 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ లోక్సభ ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీలు రెండేసి స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ- అకాలీదళ్ కూటమి సీట్లపై ప్రకటన ఉండనుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.