ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి స్కూటీపై కూర్చుని ఓ వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించింది. వృద్ధుడి స్కూటీ ఎక్కి దిగనంటే దిగనంటూ అంటూ చేసిన నిర్వాకం చూసి అంతా అవక్కయ్యారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి గుర్రం మొఖం కలిగిన ఓ మాస్క్ ధరించి ఆ గుర్రం దగ్గరకు వెళ్లింది. ఇంకేముంది పాపం ఆ గుర్రం.. తన దెగ్గరికి నిజమైన గుర్రం వచ్చిందని రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లింది. అదే ఆవేశం, ఉత్సుకత తో ఆ మాస్క్ పై ముద్దు పెట్టింది. ఆ తర్వాత మాస్క్ ధరించిన మహిళ తన మాస్క్ ను బయటకు తీయడంతో.. ఒక్కసారిగా ఆ గుర్రం షాకైంది. దాంతో వెంటనే ఆ గుర్రం వెనక్కి తిరిగి పరుగులు…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలను వెలుగులోకి వచ్చిన అనేక ఘటనలు చుశాం. అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరో స్కాం బయట పడింది. అది ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోన్ ఫ్రాడ్. దీనితో మోసగాళ్లు ఏకంగా మనకి సంబంధిచిన స్నేహితులు, బంధువులు లేదా తల్లిదండ్రులు వాయిస్ లని క్లోనింగ్ చేసి ఫేక్ కాల్స్ తో కొత్త దందాకి తెరలేపారు.
గీతాంజలి ఆత్మహత్యకు టీడీపీ- జనసేన సోషల్ మీడియా వేధింపులే కారణమని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ఆరోపించారు. వేధింపులకు కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిందితులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఇక, ఈ నెల 15 లేదా 16 ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.
నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయం లోనే ఆవిడ హీరో అజయ్ దేవగణ్తో పీకల్లోతు ప్రేమాయణంను నడిపించింది. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఆపై అభిషేక్ బచ్చన్ ను ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాకపోతే ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది.
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు.
తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వైరల్ అవుతున్న విడియోలో ఓ ప్రెజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే అక్కడ యువతి చేసిన పని చూస్తే నిజంగా ఆశ్యర్యపోవాల్సిందే. బాగా వేడిగా ఉన్న ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించి ఆ యువతి ఏకంగా ఇంట్లో వారి దుస్తులను ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు.