One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నిక.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. 18,626 పేజీల ఈ నివేదికలో లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించి ఒకే ఓటరు జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్ పోల్ ప్యానెల్ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది. కేవలం ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల కొనుగోలుకు మాత్రమే ఈ ఖర్చు అవుతుంది.
Read Also: Lok Sabha Election 2024 : ఎన్నికల తేదీలు వెలువడిన వెంటనే వేటిపై నిషేధం విధిస్తారంటే ?
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
అయితే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటైన కమిటీ 161 రోజుల పాటు పలు రాజకీయ పార్టీలతో చర్చలు జరిపింది. అదే క్రమంలో ఫిబ్రవరి 20న ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసి అభిప్రాయాలు కోరింది. ఎన్నికల సంఘం కూడా కోవింద్ కమిటీకి నిధుల అవసరాన్ని తెలియజేసింది. ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని 17 మార్చి 2023న లా కమిషన్కు చెప్పింది. ఇక, ఈవీఎంలు లేదా ఉద్యోగులలో స్థానిక సంస్థల ఎన్నికలను చేర్చలేదని ఎన్నికల సంఘం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్పై ఉంది. ఎన్నికల ప్రక్రియను మార్చాలంటే మొత్తం వ్యవస్థలో పెను మార్పులు అవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది.
Read Also: Health Tips : పళ్ళను శుభ్రం చెయ్యడానికి పేస్ట్ను వాడుతున్నారా? ఇది మీకోసమే..
ఇక, 2023 మార్చిలో ఓటింగ్ బూత్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. 2019లో 10.38 లక్షల పోలింగ్ బూత్లు ఉండగా.. 2024 నాటికి 11.93 లక్షలకు పెంచాలి అని తెలిపింది. పోలింగ్ బూత్ల సంఖ్య పెరగడం వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం అవుతాయి. కేంద్ర బలగాల సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది.. భద్రతా బలగాల సంఖ్యను కనీసం 50 శాతం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, అసెంబ్లీ- లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఈ సంఖ్య మరింత పెరగనుంది అని ఈసీ వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే రెండు సంస్థలైన బీఈఎల్, ఈసీఐఎల్లకు కూడా సమయం కావాలని ఎన్నికల సంఘం తెలిపింది. దాదాపు 53.57 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 38.67 లక్షల కంట్రోల్ యూనిట్లు, 41.65 లక్షల VVPATలు అవసరమవుతాయని అంచనా.. ఇందు కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!