YS Jagan: పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్.. మధ్యాహ్నం బెంగళూరుకు మాజీ సీఎం..
- పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన..
- వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించనున్న మాజీ సీఎం.. మధ్యాహ్నం 12. 20 గంటలకు బెంగళూరు వెళ్లనున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండవ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల చేరుకున్నారు వైఎస్ జగన్.. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైయస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం 12. 20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు.. మార్చి 3 లేదా ఆ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారట వైఎస్ జగన్..
Read Also: VIJAY : నేడు విజయ్ ‘TVK’ పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Also Read
కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం విదితమే.. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేశారు.. ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు శాసన సభ సమావేశాలను హాజరుకాబోమంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని శాసన మండలి వేదికగా నిలదీయాలని నిర్ణయించారు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి హాజరవుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..