Minister Savitha: మూడు రాజధానుల పేరిట సీమకు తీరని ద్రోహం.. జగన్పై మంత్రి ఫైర్..
- రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి..
- తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Savitha: రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితా విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంఛార్జ్ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కారకులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని, 42 మంది ప్రజలు కొట్టుకుపోయి చనిపోతే కనీసం వారికి న్యాయం కూడా చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రజల యొక్క సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారమయ్యేవి అధికారులు పరిష్కారం చేస్తారని, పరిష్కారం కాని సమస్యలను 45 రోజుల లోపు పరిష్కారం చేసేలా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రానికి త్వరలోనే హైకోర్టు బెంచ్ , పరిశ్రమలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నారని మంత్రి అన్నారు.
Read Also: Syria Crisis: సిరియా సంక్షోభంపై స్పందించిన భారత్.. ఏం చెప్పిందంటే..!
Also Read
మంచి ప్రభుత్వానికి నిదర్శనం రెవిన్యూ సదస్సులే అని అభివర్ణించారు మంత్రి సవిత.. మూడు రాజధానుల పేరిట సీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని మండిపడ్డా ఆమె.. సీమ జిల్లాలో హైకోర్టు అని గొప్పలు చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే బెంచ్ ఏర్పాటుకు ముందుడగు పడినందనున్నారు.. సీమలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తాం.. గ్రామాల్లోని భూ సమస్యలకు రెవిన్యూ సదస్సులతో చెక్ పెడతామన్నారు.. ప్రజల నమ్మకాన్ని చూరగున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వల్ల రాయలసీమకు త్వరలోనే హైకోర్టు బెంచ్, పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు మంత్ర సవిత.
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!