Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కలవనున్న జగన్
- సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో పరామర్శ
- బాధిత కుటుంబాలకు వైసీపీ అండపై భరోసా
- ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ పూర్తి షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Plant Accident : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మరణించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి, వారికి పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఈ పర్యటన సందర్భంగా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు విశాఖలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి.
వైఎస్ జగన్ పర్యటన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వస్తారు. విమానాశ్రయం నుండి నేరుగా రాంనగర్లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి ఉదయం 11:40 గంటలకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుండి బయలుదేరి, మధ్యాహ్నం 1:50 గంటలకు షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు.
Also Read
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఆసుపత్రుల సందర్శన ముగించుకుని మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి 2:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ నుండి ప్రత్యేక విమానంలో తిరుగుపయనమై, మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ప్రయాణించి సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోవడంతో వైఎస్ జగన్ విశాఖ పర్యటన ముగుస్తుంది.
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!