Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కలవనున్న జగన్
- సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో పరామర్శ
- బాధిత కుటుంబాలకు వైసీపీ అండపై భరోసా
- ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ పూర్తి షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Plant Accident : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మరణించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి, వారికి పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఈ పర్యటన సందర్భంగా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు విశాఖలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి.
వైఎస్ జగన్ పర్యటన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వస్తారు. విమానాశ్రయం నుండి నేరుగా రాంనగర్లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి ఉదయం 11:40 గంటలకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుండి బయలుదేరి, మధ్యాహ్నం 1:50 గంటలకు షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఆసుపత్రుల సందర్శన ముగించుకుని మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి 2:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ నుండి ప్రత్యేక విమానంలో తిరుగుపయనమై, మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ప్రయాణించి సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోవడంతో వైఎస్ జగన్ విశాఖ పర్యటన ముగుస్తుంది.
తాజావార్తలు
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?