Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Slams Cm Chandrababu Agriculture Should Be A Festival But Became A Burden Under His Rule

YS Jagan: పండుగలా ఉండాల్సిన వ్యవసాయం.. చంద్రబాబు హయాంలో దండుగలా మారింది!

Published Date :December 4, 2025 , 12:51 pm
By Sampath Kumar
  • రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉంది
  • రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది
  • పండుగలా ఉండాల్సిన వ్యవసాయం చంద్రబాబు హయాంలో దండుగలా మారింది
YS Jagan: పండుగలా ఉండాల్సిన వ్యవసాయం.. చంద్రబాబు హయాంలో దండుగలా మారింది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలని, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు.

‘గత ఏడాది ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా తుఫానుకు నష్టపోయిన రైతుల ధాన్యం కొనేవాళ్ళు లేరు. దళారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అడుగుతున్నారు. దిత్వా తుఫాను పంట చేతికొచ్చే దశలో వస్తుందని 10 రోజుల ముందే తెలుసు. ఈ పంట కొనకుంటే ధాన్యం తడిసిపోతుంది అని తెలుసు. అన్నీ తెలిసినా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు తప్ప ఏమీ చేయటం లేదు. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసే వాళ్ళం, అన్నీ పనులు జరిగిపోయేవి. ఇవాళ రైతులు ఎలా పోయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఏ పంటకు రేట్లు లేవు, కేజీ అరటి అర్థ రూపాయి అంటే రైతులు ఎలా బ్రతుకుతారు. ఇంత ఘోరంగా పాలన చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. చీనీ రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపి పంట ఎగుమతి చేశాం. దళారులు లేరు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చాయి. రైతులకు 20 నుంచి 40 శాతం వరకు రేట్లు పెరిగాయి. చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. నిద్ర పోతున్నాడా?. ముఖ్యమంత్రిని చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా. రైతులను పట్టించుకోవాలి కదా. మా హాయంలో పులివెందులలో ప్రారంభించిన కోల్డ్ స్టోరేజ్ మూసేసారు. రైతులకు ఇచ్చిన హామీలు మోసపూరితమని అర్థమైంది’ అని జగన్ మండిపడ్డారు.

‘ఆర్బీకేల్లో ఏ పంటకు గిట్టుబాటు ధర ఎంత అని బోర్డులు పెట్టాం. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుంటే నేరుగా జాయింట్ కలెక్టర్లు రంగంలోకి దిగేవాళ్లు. మార్క్ ఫెడ్ ద్వారా మంచి రేటు ఇచ్చేవాళ్ళం. రైతుకు ఏమీ చేయకుండా రైతన్నా మీకోసం అంటున్న చంద్రబాబు.. రైతుల దగ్గరకు వెళ్తే కొట్టే రోజులు వస్తాయి. చంద్రబాబు అనే వ్యక్తి రైతుల కోసం ఏ రోజైనా నిలబడ్డాడా?. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇచ్చేసాం అంటున్నారు.. నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. సూపర్ సిక్స్ లో అసలు ఏం చేశారో చెప్పాలి. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని తడుముకోకుండా చెప్పేస్తున్నారు. గోపాలపురం సభలో సూపర్ సిక్స్ అన్నీ చేసేసాం అని చెప్పారు. వీళ్లను చూసి గోబెల్స్ ప్రచారం ఎలాగో నేర్చుకోవాలి. చంద్రబాబు గోబెల్స్ కు టీచర్. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక సూపర్ సిక్స్ అన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెలనెల మూడు వేలు ఇస్తా అన్నారు.. రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళకు నెలనెలా 1500 అన్నారు.. ఇప్పటి వరకు ఇచ్చారా?. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు ఇచ్చారా. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు 40 వేలకు గానూ 10 వేలు మాత్రమే ఇచ్చారు. తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. రెండవ ఏడాది 20 లక్షల మందికి తగ్గించారు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇవ్వటం మోసం కాదా. ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు.. రెండేళ్లకు ఆరు ఇచ్చింది ఒకటో.. రెండో. మహిళలకు ఉచిత బస్సు అన్నారు.. అందరికీ ఇస్తున్నారా. ఇలాంటి 420 పనులు చేస్తున్న చంద్రబాబును బొక్కలో వెయ్యాలి కదా?’ అని జగన్ ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • AP Farmers
  • cm chandrababu
  • ycp
  • ys jagan

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions