YS Jagan: ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ.. రాష్ట్ర భవిష్యత్త్ను నాశనం చేసేలా ప్రభుత్వ నిర్ణయం..
- చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్..
- అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టింది..
- నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా ఏపీఎండీసీ ద్వారా రెండోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల డ్రా చేయడం సరికాదు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Read Also: Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Off The Record: కాపు రిజర్వేషన్స్ పై ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలనుకున్నారా..!
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్పై కీలక ఆదేశాలు..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
అయితే, ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రూ. 1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు అని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది.. ఆ కేసులో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చింది.. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు అని తెలిపారు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే కాక రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రభుత్వం నాశనం చేస్తోంది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Another breach of the Constitution of India by the AP Government.
It is learnt that, APMDC is attempting another Bond (NCD) issuance on 24th June, 2025, on terms violative of the Constitution of India, in an unprecedented manner.
Private parties are being… pic.twitter.com/QVgwk7dKe8
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2025
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!