* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్.
*మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా.
*నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనలు.
*ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు.
* సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి చేరిన వైస్సార్టీపీ షర్మిల ప్రజా ప్రస్తానం పాదయాత్ర. నేటి నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్ర.
* భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 10 ,11 తేదీలలో జరిగే శ్రీరామనవమి , పట్టాభిషేకం వీక్షించే భక్తులకు సెక్టార్ టిక్కెట్లును కౌంటర్లు ద్వారా విక్రయిస్తున్న దేవస్థానం. టికెట్లు లభించే కేంద్రాలు:తానీషా కళ్యాణ మండపం, ఆలయ రాజగోపురం ముందు, బ్రిడ్జి పాయింట్ , SBI బ్యాంక్ ,భద్రాచలం, రెవెన్యూ డివిజన్ ఆఫీస్ , కొత్తగూడెం.