Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News The Mystery Left Behind In The Case Of The Disappearance Of The Young Woman

Missing Women Killed: యువతి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ.. సూత్రధారులు ప్రేమికులే!

Published Date :October 8, 2022 , 10:33 am
By NTV WebDesk
Missing Women Killed: యువతి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ.. సూత్రధారులు ప్రేమికులే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Missing Women Killed: ఏడాది క్రితం ఓ యువతి అదృశ్యమైన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియురాలే అసలు సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారమే ప్రియుడు ప్రియురాలు కలిసి ఆయువతిని చంపేసారని విచారణలో తేలింది. ఈఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగింది.

చింత పల్లి ఏఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. జి.మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీ చిట్టంపుట్టు గ్రామానికి చెందిన కోరాబు లక్ష్మి, చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ సంపంగి పుట్టుకు చెందిన వండలం గోపాల్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం గోపాల్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు మందలించి, గత ఏడాది ఆగస్టులో అదే గ్రామానికి చెందిన చెదల కాంతమ్మ(20)తో వివాహం చేసేందుకు నిర్ణయించడంతో.. కాంతమ్మతో గోపాల్ సన్నిహితంగా ఉండడాన్ని లక్ష్మి సహించలేక పోయింది. గోపాల్‌ ను నిలదీసింది. దీంతో అసలు ప్లాన్‌ ను లక్ష్మి ముందు పెట్టాడు గోపాల్‌ సన్నిహితంగా వుండి కాంతమ్మను చంపేసి ఇద్దరు కలిసి వుండటానికే ఇదంతా చేస్తున్నట్లు చెప్పాడు. దీనికి సరే అన్న లక్ష్మి.. గత ఏడాది సెప్టెంబరు తొమ్మిదో తేదీన గోపాల్, లక్ష్మి కలిసి కాంతమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడే కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

Also Read

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
  • Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
  • Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
  • Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..

తరువాత తనను ఇంటి వద్ద దిగబెట్టాలని లక్ష్మీ కోరింది. దీంతోముగ్గురూ కలిసి సంపంగిపుట్టు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిట్టంపుట్టు వెళ్లారు. వినాయక చవితి కావడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మండపంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లారు. అయితే.. లక్ష్మి, కాంతమ్మ ఇంటి లోపలకు వెళ్లగా, గోపాల్ బయట ఉన్నాడు. కాంతమ్మ కూర్చోని ఉండగా లక్ష్మి గొడ్డలి తీసుకుని తల వెనుక భాగంలో బలంగా కొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయి గట్టిగా కేకలు వేసింది. గోపాల్ వెంటనే లోపలకు వచ్చి కాంతమ్మ నోరు, ముక్కు గట్టిగా నొక్కి పెట్టాడు లక్ష్మి మరోమారు కాంతమ్మ. తలపై గొడ్డలితో బలంగా కొట్టింది. దీంతో కాంతమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. ఇద్దరూ కలిసి కాంతమ్మ మృతదేహాన్ని రగ్గులో చుట్టి, సుమారు వందడుగుల దూరంలో ఒక గోతిలో పూడ్చివేశారు.

కుటుంబసభ్యులు కాంతమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. లక్ష్మి.. గోపాల్న ప్రశ్నించారు వారిద్దరు పొంతన లేని సమాధానాలివ్వడంతో మృతిరాలి తల్లి నారాయణమ్మ అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదుచేశారు. మూడు నెలల అనంతరం గోపాల్, లక్ష్మి కలిసి తూర్పుగోదావరి జిల్లా అలమూరు వెళ్లి సహజీవనం చేయసాగారు. ఈ నేపథ్యంలో, కాంతమ్మ మిస్సింగ్ కేసు విచారణను వేగవంతం చేయాలన్న జిల్లా ఎస్పీ ఎస్. సతీ కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్సీ పర్యవేక్షణలో అన్నవరం ఎస్ఐ సాయి రంగంలోకి దిగి, గోపాల్, లక్ష్మి ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడకు వెళ్లి కాంతమ్మ హత్య గురించి విచారించడంతో వారు నేరం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కాంతమ్మ మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. నిందితులు గోపాల్, లక్ష్మీ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluri jilla Crime
  • Ap news Crime
  • lover Crime news
  • lovers forest
  • Missing Women Killed

తాజావార్తలు

  • RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్‌సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్‌-2కి జంప్‌!

  • Sree Vishnu : హిట్లు లేకున్నా జోరు తగ్గని శ్రీవిష్ణు..

  • Astrology: ఏప్రిల్‌ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!

  • AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions