Cyber Crime: భారీ సైబర్ క్రైమ్ ఛేదించిన భీమవరం పోలీసులు.. ఐదుగురు అరెస్టు!
- భారీ సైబర్ క్రైమ్ ఛేదించిన భీమవరం పోలీసులు..
- సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న ఐదుగురు అరెస్టు..
- ముఠా సభ్యుల నుంచి రూ. 50 లక్షల వరకు రికవరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక, విచారణలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సైబర్ క్రైమ్ ముఠా సభ్యులు ఉద్యోగాల కోసం కంబోడియా వెళ్లి, అక్కడ ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పద్ధతులపై ట్రైనింగ్ తీసుకుని.. అనంతరం భారత్కు వచ్చి, ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు తేలింది. బ్యాంక్ OTP ఫ్రాడ్స్, KYC అప్డేట్ పేరుతో మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ ద్వారా నగదు దోచుకోవడం లాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Stock Market: మార్కెట్కు కొత్త జోష్.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
అయితే, ఈ ముఠా సైబర్ నేరాల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 50 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లు సమాచారం. నిందితుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు, డిజిటల్ వాలెట్ వివరాలను హస్తగతం చేసుకున్నారు పోలీసులు.. అలాగే, ఈ కేసులో ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నయూమ్ ఆస్మి మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదు, బ్యాంక్ OTP లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!