Chandrababu Naidu: పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము అధికారంలోకి వస్తే పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గోదావరి వరదలతో సతమతం అయిన విలీన మండలాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ ఏలూరు జిల్లా వేలేరుపాడు, శివకాశీపురంలో పర్యటించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన.. నేను వస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద ప్రాంతాలకు వచ్చారు.. ఉన్న ఇంటిని వదిలి వరద బాధితులు ఎంత కష్టంలో వున్నారో నేను అర్దం చేసుకోగలను.. 2 వేల రూపాయలతో బాధితుల కష్టాలు తీరవు, బాధితులు చాలా కష్టాల్లో ఉంటే సీఎం పుండు మీద కారం చెల్లాడు.. నేను పోలవరం కట్టలేనని చేతులెత్తేశారని ఫైర్ అయ్యారు.. ప్రాజెక్ట్ వల్ల నష్ట పోయే వారికి న్యాయం చేయాలని నా ఆకాంక్ష అన్న చంద్రబాబు.. ఇల్లు కట్టిస్తే వెళ్ళిపోతాయని బాధితులు చెబుతున్నారు.. వెయ్యి, రెండు వేల కోట్లు అయితే ఇస్తా రూ. 20 వేల కోట్లు అయితే నేను ఇవ్వలేను అని సీఎం అంటున్నారు.. మరి ఎందుకు హామీ ఇచ్చారు? అని నిలదీశారు.
Read Also: Amnesia Pub Case : అమ్మాయిని ట్రాప్ చేసి గ్యాంగ్రేప్ చేశారు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ఇక, సీఎం జగన్ పరామర్శకు వచ్చినప్పుడు పేటీయం బ్యాచ్ చప్పట్లు కొట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.. పేటియం బ్యాచ్, కోడి కత్తి కమలహాసన్ ఇక్కడికి వచ్చి.. నిజమైన బాధితుల పరిస్థితి చూడాలని సలహా ఇచ్చారు. పశువులకు వేసే గడ్డి విశ్వసనీయత లేనివారికి ప్రజలు తినిపించాలి అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. ఓట్ల కోసం పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి.. ప్రజలు కష్టాల్లో వుంటే గాల్లో తిరిగారని ఎద్దేవా చేశారు.. 41 కాంటూరు పరిధిలో మాత్రమే కాదు 45.75 కాంటూరు పరిధిలో ఉండే వారందరికీ నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన.. పోలవరం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలన్నారు.. మరోవైపు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు మండలాలను కలిపి ఒక జిల్లా చేస్తామని ప్రకటించారు..
బురదలో వుండే వారి కష్టాలు తాడేపల్లి ప్యాలెస్లో వుండే వారికి తెలీదు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.. ప్రజల మధ్య ఉండి వారి కష్టాలు తెలుసుకోవడం మానవత్వం వున్న ప్రభుత్వ లక్షణం అని హితవు పలికారు.. 30 ఏళ్లలో ఎప్పుడు రాని వరద వచ్చిందని చెబుతున్నారు.. జీవో నెం 1210 హూద్ హూద్ తుఫాన్ సమయంలో ఇచ్చాం.. దానికంటే ఎక్కువ సాయం చేస్తే మేమే శభాష్ అంటాం అని సవాల్ చేశారు.. చేతులెత్తేస్తే పోలవరం కట్టలేమన్న ఆయన.. ముంపు గ్రామాల ప్రజలు మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, విలీన మండలాల్లో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. తన పర్యటనలో భాగంగా భద్రాద్రి రామయ్యను కూడా దర్శించుకోనున్నారు టీడీపీ అధినేత.
తాజావార్తలు
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!