Payyavula Keshav: మంత్రి బుగ్గన మళ్ళీ బుర్రకథలు చెబుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ సాగుతూ వుంటుంది. అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ ఆకట్టుకునేలా ప్రసంగిస్తుంటారు. వైసీపీ సభ్యులపై ఆయన తనదైన రీతిలో కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో పయ్యావుల, మంత్రి బుగ్గన మధ్య వాడివేడి చర్చ సాగింది. అమరావతి భూముల వివాదంపై అసెంబ్లీలో చర్చలో పయ్యావుల ఆవేశంగా మాట్లాడారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కేసులు పెట్టారు.. కోర్టు ద్వారా చీవాట్లు తిన్నా మీరు మారలేదు.
ఎస్సీ భూముల కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదు. సీఎం ప్రకటన తర్వాతే నేను భూములు కొన్నాను. భూములు కొంటే తప్పేంటి? అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో ఆర్థికమంత్రి బుగ్గనకు పయ్యావులకు మధ్య మాటల యుద్ధం.. 4-9-2014 న రాజధాని ప్రకటన చేశారని పయ్యావుల వివరించారు. నేను సెప్టెంబర్ నెలలో కొన్నాను. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేసులు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని పయ్యావుల ప్రశ్నించారు.
Also Read
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు 16మందిని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షనుకు ముందు సభలో టెన్షన్ ఏర్పడింది. పొడియం ముందున్న టీడీపీ సభ్యులను ఛైర్లల్లో కూర్చొపెట్టేందుకు ప్రయత్నించారు మార్షల్స్.సభలో సభ్యులపై చేయి వేసే అధికారం మార్షల్సుకు లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్సుపై విరుచుపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. పలువురు మార్షల్సును తోసేశారు టీడీపీ సభ్యులు.ఛైర్లల్లో కూర్చునేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో సస్పెన్షన్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. బుగ్గన మళ్లీ బుర్ర కథలు చెప్పారు.మూడేళ్ల క్రితం చెప్పినవే మళ్లీ మళ్లీ చెప్పారు.రాజధాని భూముల్లో ఏవో అక్రమాలు జరిగాయని మళ్లీ అందరి పేర్లు బుగ్గన ప్రస్తావించే ప్రయత్నం చేశారు.ఇవాళ అసెంబ్లీలో వైసీపీ బొక్కా బోర్లా పడింది.బుగ్గనను చూసి డోన్ నడివీధుల్లో నవ్వుతున్నారు.బుగ్గన తన వయస్సుకు తగ్గట్టు వ్యవహరిస్తే బాగుంటుంది.రాజధాని పరిధిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదు.. ఇన్ సైడ్ ఫీలింగ్ బయటపడింది.ఎస్సీ భూముల్లో అక్రమాలను తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇప్పటికీ భూముల అక్రమాలపై విచారణ చేయాలనుకుంటే.. అమరావతి భూములతో పాటు.. విశాఖ భూముల పైనా విచారణ చేసే దమ్ముందా..?విశాఖ భూములపై హైకోర్టులో విచారణకు సిద్దమా..? అన్నారు పయ్యావుల.
Read Also: Ranveer Singh: నువ్వో పెద్ద ఫిగర్ వా.. నీ ఫోటో మార్ఫింగ్ చేయడానికి
తాజావార్తలు
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?