Botsa Satyanarayana: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం మౌనం..
- కూటమి ప్రభుత్వంపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యాం కలిగిన ప్రభుత్వం ఉందా లేదా అనే డౌట్ వస్తుంది..
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం మౌనం: ఎమ్మెల్సీ బొత్స సత్యనారయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీన లిక్కర్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ జగన్ ములాఖాత్ వాయిదా పడింది అన్నారు. అలాగే, వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండే అవకాశం ఉంది.. రాష్ట్రంలలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి.. ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వం లేదు.. స్వార్థం కోసం పనులు జరుగుతున్నాయి.. ఇది మంచి సాంప్రదాయం కాదని కూటమి సర్కార్ ను హెచ్చరిస్తున్నాం.. ఏ వర్గం చూసుకున్నా సంతృప్తికరంగా లేదు.. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తుంది.. రైతులు, రైతు కూలీలు , విద్యార్థులు, వ్యాపారులకు అన్యాయం జరుగుతుంది.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం తప్ప రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాలోని 60 నుంచి 70 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందలేదు.. తల్లికి వందనం పథకం పూర్తి స్థాయిలో అందించలేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Rekha Gupta: రేఖా గుప్తాను పరామర్శించిన బీజేపీ ఎంపీలు.. దాడి తర్వాత సీఎం ఫొటో విడుదల
Also Read
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
ఇక, లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి డబ్బులు ఏమి చేశారని మాజీమంత్రి బొత్స ప్రశ్నించారు. రోడ్లు నిర్మాణాలు ఎక్కడా…? ఒక్క రోడ్డు వేయడం లేదన్నారు. అలాగే, అత్యాచారాలు పెరిగిపోయాయి.. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప మరి ఏం చేయడం లేదు.. గడిచిన 14 నెలల పాలనలో నేరాలు ఘోరంగా పెరిగాయి.. ఇదేనా మంచి పరిపాలన?.. ప్రజా ప్రతినిధులు వారి తాబేదారులతో కలిసి భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నాడు రాజీనామాలకు సిద్ధపడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమైపోయారని అడిగారు. 14 నెలలుగా ఢిల్లీ వెళ్తున ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నారు.. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడటం లేదు అని ఎమ్మెల్యే సత్యనారాయణ క్వశ్చన్ చేశారు.
Read Also: Minister Seethakka: జంపన్న వాగును అభివృద్ధి చేస్తాం.. 29 ఎకరాల్లో స్మృతి వనం!
అయితే, విశాఖ ఉక్కుపై కలిసివచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. యూరియా బస్తా ఇవ్వాలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఈ సర్కార్ కు చిత్తశుద్ధి లేదు.. చంద్రబాబు ఇచ్చిన వాగ్థానాలు అన్ని అబద్దం.. దీనిపై నిలదీస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టవలసి వస్తే ముందు చంద్రబాబుపై పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!