Vizag Airport Lands: ఎయిర్ పోర్ట్ భూములు వెనక్కి.. నెక్స్ట్ ఏంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ అంతర్జాతీయ విమానాశ్ర యం కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 800కోట్ల రూపాయల విలువైన ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలని ఏపీ సర్కారు రాసిన లేఖ కేంద్రం పరిశీలన లో ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న 74ఎకరాలను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలనేది ఆలోచన.
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సుమారు 375 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజు పదుల సంఖ్యలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏటి కేడాది ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పేరుకి అంతర్జాతీయ విమానాశ్రయమే అయినప్పటికీ అజమాయిషీ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. నౌకాదళ వాయుస్థావరం ‘ఐ.ఎన్. ఎస్. డేగా’ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. పైలట్లకు యుద్ధ వి మానాల శిక్షణ ఇక్కడే ఇస్తుంటా రు. దేశభద్రత దృష్ట్యా ఈ ఎయిర్ పోర్ట్ అత్యంత కీలకమైనది. రక్షణ, నేవీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆంక్షలు అమలు చేస్తుంది. ఫలితంగా పౌర విమానాలు రాక పోకలు విస్తృతం అయ్యేందుకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం వడివడిగా అడుగులుపడుతున్నాయి.
Also Read
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ఆర్కేబీచ్ నుంచి భోగాపురం వరకు రహదారుల విస్తరణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే త్వరలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభింకానున్నాయి.ఈ విమానాశ్రయం అందుబాటు లోకి వస్తే దేశీయ,విదేశీ సంస్థలు ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తాయి. తద్వారా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కు మరిన్ని విమానాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.నగరం నడిబొడ్డున ఉన్న ఎయిర్ పోర్ట్ అవసరాల కోసం 2002లో అప్పటి ప్రభుత్వం 74 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 800కోట్ల రూపాయలు కాగా అత్యంత ఖరీదైన ఈ భూములను తిరిగి అప్పగించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ మనుగడ లోకి వస్తే…. వైజాగ్ విమానాశ్రయంపై ఒత్తిడి చాలా వరకు తగ్గి పోతుంది. దీనిని ఆధారంగా చే సుకుని భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత ప్రభుత్వ వాటా కింద వైజాగ్ ఎయిర్ పోర్ట్ పరిధిలోని భూములను తిరిగి స్వాధీనం చెయ్యాలని లేఖ రాసింది. ఈ భూములు అందుబాటులోకి వస్తే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఏరో సిటీ వంటి ప్రతిపాదనలు చర్చల్లో తిరుగుతున్నప్పటికీ నేవీ కార్యకలాపాలు జరిగే చోట ఎంత వరకు సాధ్యం అనేది ఆసక్తికరం. వాస్తవానికి ఒకసారి భూములను కేంద్రానికి ఇచ్చిన తరువాత తిరిగి తీసుకునే ప్రక్రియ సంక్లిష్టమైనది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ విధంగా కొలిక్కి వస్తుందో చూడాలి.
Read Also: High Alert in Vijayawada: బెజవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!