Vizag Airport Lands: ఎయిర్ పోర్ట్ భూములు వెనక్కి.. నెక్స్ట్ ఏంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ అంతర్జాతీయ విమానాశ్ర యం కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 800కోట్ల రూపాయల విలువైన ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలని ఏపీ సర్కారు రాసిన లేఖ కేంద్రం పరిశీలన లో ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న 74ఎకరాలను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలనేది ఆలోచన.
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సుమారు 375 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజు పదుల సంఖ్యలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏటి కేడాది ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పేరుకి అంతర్జాతీయ విమానాశ్రయమే అయినప్పటికీ అజమాయిషీ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. నౌకాదళ వాయుస్థావరం ‘ఐ.ఎన్. ఎస్. డేగా’ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. పైలట్లకు యుద్ధ వి మానాల శిక్షణ ఇక్కడే ఇస్తుంటా రు. దేశభద్రత దృష్ట్యా ఈ ఎయిర్ పోర్ట్ అత్యంత కీలకమైనది. రక్షణ, నేవీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆంక్షలు అమలు చేస్తుంది. ఫలితంగా పౌర విమానాలు రాక పోకలు విస్తృతం అయ్యేందుకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం వడివడిగా అడుగులుపడుతున్నాయి.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఆర్కేబీచ్ నుంచి భోగాపురం వరకు రహదారుల విస్తరణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే త్వరలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభింకానున్నాయి.ఈ విమానాశ్రయం అందుబాటు లోకి వస్తే దేశీయ,విదేశీ సంస్థలు ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తాయి. తద్వారా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కు మరిన్ని విమానాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.నగరం నడిబొడ్డున ఉన్న ఎయిర్ పోర్ట్ అవసరాల కోసం 2002లో అప్పటి ప్రభుత్వం 74 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 800కోట్ల రూపాయలు కాగా అత్యంత ఖరీదైన ఈ భూములను తిరిగి అప్పగించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ మనుగడ లోకి వస్తే…. వైజాగ్ విమానాశ్రయంపై ఒత్తిడి చాలా వరకు తగ్గి పోతుంది. దీనిని ఆధారంగా చే సుకుని భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత ప్రభుత్వ వాటా కింద వైజాగ్ ఎయిర్ పోర్ట్ పరిధిలోని భూములను తిరిగి స్వాధీనం చెయ్యాలని లేఖ రాసింది. ఈ భూములు అందుబాటులోకి వస్తే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఏరో సిటీ వంటి ప్రతిపాదనలు చర్చల్లో తిరుగుతున్నప్పటికీ నేవీ కార్యకలాపాలు జరిగే చోట ఎంత వరకు సాధ్యం అనేది ఆసక్తికరం. వాస్తవానికి ఒకసారి భూములను కేంద్రానికి ఇచ్చిన తరువాత తిరిగి తీసుకునే ప్రక్రియ సంక్లిష్టమైనది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ విధంగా కొలిక్కి వస్తుందో చూడాలి.
Read Also: High Alert in Vijayawada: బెజవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!