Union Minister Ram Mohan Naidu: ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బెజవాడ వరద సహాయంపై కేంద్రం నిర్ణయం..
- ఇంటర్ మినిస్టీరియల్ సర్వే రిపోర్ట్ రాగానే బెజవాడ వరదల సహాయంపై నిర్ణయం..
- రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
Union Minister Ram Mohan Naidu: ఇంటర్ మినిస్టీరియల్ సర్వే రిపోర్ట్ తర్వాతే బెజవాడ వరదల సహాయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరదల ముంపుపై మాజీ సీఎం జగన్మోహ న్ రెడ్డి చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయంలో అసబద్ధమైన విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజలు జగన్ ను చూస్తే భయపడే పరిస్ధితులు వచ్చాయన్నారు రామ్మోహన్ నాయుడు. విశాఖ ఎయిర్ పోర్టులో డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన ఆయన.. ఈ యాప్ ద్వారా విమాన ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారానికి వచ్చిన ఇబ్బంది ఏమీ వుండదని, తమదే పూర్తి బాధ్యత అని చెప్పారు..
Read Also: Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి
Also Read
ఇక, అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖపట్నం నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. వీటిలో విశాఖ-విజయవాడ మధ్య ఒకటి వుండనుంది. ఇక, రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం వచ్చిన అభ్యర్థలను, ఫీజబులిటీ రిపోర్ట్, భూమి లభ్యత ఆధారంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే దేశంలో సీప్లేన్స్ ప్రవేశ పెడతామని వెల్లడించారు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం విదితమే.. తెలంగాణలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానికదళ హెలికాప్టర్లు.. ఏపీలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 8 వైమానికదళ హెలికాప్టర్లు, 3 నౌకాదళ హెలికాప్టర్లు.. వరద సహాయక చర్యలో పాల్గొంటున్నాయని కేంద్ర హోంశాఖ..
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!