Simhadri Appanna : సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి భారీగా భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహాచల పుణ్యకేత్రంలో వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అప్పన్న స్వామిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు.. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీవీఐపీల రాకతో ఆలయం దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుందని అంటున్నారు. అయితే ఆలయ అధికారులుమ మాత్రం టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రతీ సంవత్సరంలా కాకుండా.. ఈ ఏడాది సాయంత్రం వరకు కూడా స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Bhakthi TV : అక్షయ తృతీయ నాడు ఈ స్తోత్రాలు వింటే సకల పాపాలు పటాపంచలై.. సర్వ సంపన్నులవుతారు
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
ఉత్తరాది జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వేలాది మంది అప్పన్న నిజరూప దర్శనం భారీగా తరలి వచ్చారు. వీఐపీలకు పెద్దపీఠ వేయడంలో సామాన్య భక్తుల కోసం.. ప్రత్యేక దర్శనాలతో పాటు సర్వ దర్శనాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అయితే టికెట్ల విక్రయాలు, స్లాట్ కేటాయింపుల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇవాళ సాయంత్రం వరకు అప్పన్న స్వామి నిజరూప దర్శనం కొనసాగుతుంది. శనివారం అర్థరాత్రి నుంచి చందనోత్సవం ప్రారంభమైంది. దాదాపు లక్షకు పైగా భక్తులు ఈ ఉత్సవానికి వస్తుండటంతో దానికి తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి సారిగా టైమ్ స్లాట్ దర్శనాలు కూడా కేటాయించినప్పటికీ అంతరాలయ దర్శనాలపై ఆలయ ట్రస్ట్ బోర్డు, ఉత్సవ కమిటీకి మధ్య విభేదాలు తలెత్తాయి. దాదాపు ఆరు వేల మందికి అంతరాలయ దర్శనం కల్పించాలని ఉత్సవ కమిటీ నిర్ణయిస్తే.. అంతమందికి అంతరాలయ దర్శనం కల్పించలేమని పాలక మండలి లేఖ రాసింది.
Also Read : HD Kumaraswamy : అనారోగ్యం కారణంగా హాస్సిటల్లో చేరిన మాజీ సీఎం
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!