Vizag Mayor: మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్..! దేశం దాటిన కార్పొరేటర్లు..
- గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్..
- పోటాపోటీగా టీడీపీ, వైసీపీ క్యాంప్ రాజీకీయాలు..
- ఏప్రిల్ 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం..
- మలేషియాకు టీడీపీ కార్పొరేటర్ల తరలింపు..
- శ్రీలంకలో మకాం వేసిన వైసీపీ కార్పొరేటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Mayor: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. పోటాపోటీ క్యాంప్ లు నడుపుతున్న టీడీపీ, వైసీపీలు శిబిరాలను విదేశాలకు తరలించాయి. దీంతో మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్ష చుట్టూ ఉత్కంఠ రెట్టింపైంది. గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ నో కాన్ఫిడెన్స్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఎక్స్ ఆఫీస్ లో కలిపి మ్యాజిక్ ఫిగర్ 74 కాగా.. గ్రేటర్లో బలాబలాలపై కూటమి, వైసీపీ ఎవరి లెక్కలు వాళ్లవి.. బీజేపీ, జనసేనతో కలిసి తమ బలం 61కి పెరిగిందని.. మేయర్ పదవి దక్కించుకోవడం ఖాయం అనే ధీమాలో కనిపిస్తోంది టీడీపీలో..
Read Also: Vaani Kapoor : వరుస ప్లాపులతో వెనకబడిన వాణి
Also Read
అయితే, ఈ నెంబర్ గేమ్ ను వైసీపీ పట్టించుకోవడం లేదు. ఎక్స్ ఆఫీషియోతో కలిపి తమ సంఖ్యా బలం 37గా లెక్కేసుకుని అవిశ్వాసం వీగిపోవడం ఖాయం అనే అంచనాకు వచ్చింది. అటు, కూటమి.. ఇటు వైసీపీ రెండు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే తన కార్పొరేటర్లను బెంగుళూరు తరలించేసింది. సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనూహ్యంగా శిబిరాన్ని శ్రీలంకకు మార్చేస్తోంది. అందరూ కాల్పోయినా కొంత మందిని షిఫ్ట్ చేయడం అనివార్యంగా భావించినట్టు తెలిసింది. అదే సమయంలో వైసీపీలో గెలిచి ఇటీవలకూటమిలో చేరిన కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వున్న లెక్క ప్రకారం కూటమికి ఇద్దరు సభ్యులు అవసరం వుంది. దీంతో వైసీపీ పూర్తి స్థాయి వ్యూహం పన్ని అమలు చేస్తోంది.
Read Also: Nizamabad: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు మాతృ వియోగం
మరోవైపు, సంఖ్యాబలం కాపాడుకోవడం ఇప్పుడు కూటమికి పెద్ద టాస్క్. దీంతో కొన్నిరోజులుగా భీమిలిలో నడుస్తున్న క్యాంప్ ను మలేషియాకు తరలించింది. తొలి ప్రయత్నంలో 26 మంది విదేశాలకు జంప్ అయ్యారు. నిజంగానే మేయర్ ను దించే సంఖ్యాబలం ఉంటే విదేశాల్లో శిబిరాలు ఎందుకో చెప్పాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. మేయర్ పై అవిశ్వాసం ప్రకటించిన కూటమి.. ఇప్పుడు డిప్యూటీ మేయర్ కు నోటీసులు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ శ్రీధర్ ను తప్పించాలని భావిస్తుండగా.. జనసేన ఓటు కీలకంగా మారింది.. మొత్తం పార్టీకి 11మంది సభ్యులు ఉండగా.. క్యాంప్ రాజకీయాలు వద్దని హైకమాండ్ వారించినట్టు తెలి
సింది. అయితే, మేయర్ పై అవిశ్వాసం ఆషామాషీ వ్యవహారం కాదని అర్థం కావడంతో అధికార, విపక్షాలు వ్యూహాలు రాటు దే లుతున్నాయి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!