Cyber Fraud: విశాఖలో డిజిటల్ మోసం కలకలం.. రూ. 2.61 కోట్ల ఫ్రాడ్ బయటకు!
- విశాఖలో డిజిటల్ మోసం కలకలం.. రూ. 2.61 కోట్ల మోసం..
- BSE, NSE పేరుతో వాట్సాప్ గ్రూపులు వైద్యుడిని చేర్చిన సైబర్ ముఠా..
- లాభాల ఆశ చూపి వైద్యుడి నుంచి రూ. 2.61 కోట్లు కాజేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: విశాఖపట్నంలో డిజిటల్ మోసాలతో కోట్లు కాజేస్తున్న సైబర్ ముఠా అక్రమాలు బయటపడింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్న ఈ ముఠా, ఓ ప్రైవేట్ వైద్యుడిని టార్గెట్ చేసుకుని.. సుమారు రూ. 2.61 కోట్లను కాజేసింది. ఈ ఘటనపై బాధితుడు సిటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక, సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు విచారణ చేయగా.. 2023 డిసెంబరులో ఆ డాక్టర్ ను BSE & NSE డీప్ ఇన్సైట్ -9827, షేర్ – 999 అనే వాట్సప్ గ్రూపుల్లో చేర్చినట్లు గుర్తించారు. స్టాక్ ట్రేడింగ్, ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్, ఓటిసి స్టాక్స్, ఐపీఓలు లాంటి వాటిలో పెట్టుబడి పెడితే.. తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
Read Also: Congress Dharna: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా.. హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేతలు!
Also Read
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
దీంతో ఆ వైద్యుడు వారి మాటలు నమ్మి రూ. 2.61 కోట్లను బదిలీ చేశారు. ఇక, ఆ తర్వాత సైబర్ ముఠా ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చి, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల ద్వారా నగదును విత్డ్రా చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అలాగే, విచారణలో ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్లోని లాజ్పత్ నగర్ సాహిదాబాద్కు చెందిన రాజీవ్ బన్సాల్ (సలీం ఖాన్)ను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ల్యాప్టాప్లు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, స్టాంపులు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులను హస్తగతం చేసుకున్నారు.
తాజావార్తలు
-
China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
-
Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
-
Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
-
AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
-
Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!