Kapu Leaders: కాపులకు సీట్లు కేటాయించాలి.. కాపు ఉద్యమ జేఏసీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు జాతి కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసామని.. ఎన్నికల సమయంలో తమ ఓట్లు మీకు కావాలి కాబట్టి తమ ఇబ్బందులు గుర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయాలని పేర్కొన్నారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభంకు ఎవరు సముచిత స్థానం కలిపిస్తారో వారికి మద్దతిస్తామని తోట రాజీవ్ తెలిపారు.
Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
తమకు ఇచ్చిన పథకాలన్నీ కలిపి కాపులకు ఇంత ఇచ్చామని సీఎం జగన్ చెబుతున్నారని అన్నారు. అనేక కాపు భవనాలు ఇంకా పునాది దశలోనే ఉండిపోయాయని.. జిల్లాల విభజన సమయంలో కాపు నాయకులు పేర్లు పెట్టాలని కోరితే ఒక్కపేరు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వాలు అయినా.. కాపుల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాజకీయ పార్టీలు కాపుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన కోరారు.
TDP: ఉండి టీడీపీలో వర్గపోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే మండిపాటు
కాపు జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదని తోట రాజీవ్ తెలిపారు. జనాభా దామాషా ప్రకారం.. తమకు 27 శాతం సీట్లు కేటాయించాలని… ఈ పరిస్థితి ఏ పార్టీలోను లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఒక్క సీటు కాపులకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాపుల సమస్యలు పోరాటం చేసిన వారికి సీట్లు ఇవ్వాలన్నారు. కాపు కులాన్ని రాజకీయ నాయకులు కరివేపాకులా చూస్తున్నారని.. 2014లో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఉద్యమం చేసి కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!