Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: విశాఖ పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ పలు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి “విశాఖ స్టీల్ ప్లాంట్” అనే పదం పలికే అర్హత కూడా లేదని హోంమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వినియోగించాలని జగన్ భావించారని, దీనిని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారని ఆమె పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లలేదని విమర్శించారు అనిత. కార్మికులను విమానాశ్రయానికి పిలిపించి మాట్లాడారని, ప్రస్తుతం కూడా కార్మిక సంఘాల నాయకులను తన వద్దకు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బీమా ప్రయోజనాలు అందుతున్నాయని అనిత తెలిపారు. అంతేకాకుండా, తొలిసారిగా మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీసుకున్నారని వెల్లడించారు.
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 99 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే స్థితికి చేరుకుందని హోంమంత్రి పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేశాయని చెప్పారు. ఇక, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సందర్భంగా సంస్థ రూ.150 కోట్ల బీమా చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.12 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాగే గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 10.24 శాతం వాటాను కూడా గత ప్రభుత్వం వదులుకుందని విమర్శించారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా కేంద్ర ఉక్కు మంత్రిని విశాఖకు తీసుకురాలేకపోయిందని అనిత ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్లో తెల్లవారుజాము వరకు ఉండి పరిస్థితులను సమీక్షించారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడింది తమ ప్రభుత్వమేనని, మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!