Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: విశాఖ పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ పలు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి “విశాఖ స్టీల్ ప్లాంట్” అనే పదం పలికే అర్హత కూడా లేదని హోంమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాలకు వినియోగించాలని జగన్ భావించారని, దీనిని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారని ఆమె పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లలేదని విమర్శించారు అనిత. కార్మికులను విమానాశ్రయానికి పిలిపించి మాట్లాడారని, ప్రస్తుతం కూడా కార్మిక సంఘాల నాయకులను తన వద్దకు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్లో ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బీమా ప్రయోజనాలు అందుతున్నాయని అనిత తెలిపారు. అంతేకాకుండా, తొలిసారిగా మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించే నిర్ణయాన్ని కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీసుకున్నారని వెల్లడించారు.
Also Read
ఒకప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 99 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే స్థితికి చేరుకుందని హోంమంత్రి పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేశాయని చెప్పారు. ఇక, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సందర్భంగా సంస్థ రూ.150 కోట్ల బీమా చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.12 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. అలాగే గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 10.24 శాతం వాటాను కూడా గత ప్రభుత్వం వదులుకుందని విమర్శించారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా కేంద్ర ఉక్కు మంత్రిని విశాఖకు తీసుకురాలేకపోయిందని అనిత ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్లో తెల్లవారుజాము వరకు ఉండి పరిస్థితులను సమీక్షించారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడింది తమ ప్రభుత్వమేనని, మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?