Off The Record: మాగంటి బాబు….. ఏలూరు మాజీ ఎంపీ. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తర్వాతి పరిమామాలతో టీడీపీలో చేరి… 2014లో ఆ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారాయన. 2019 ఎన్నికల్లో ఓడిపోయి… 2024లో మరో ఛాన్స్ కోసం చూసినా… పక్కన పెట్టేసింది టీడీపీ అధిష్టానం. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్కు అవకాశం ఇవ్వడంపై ఆగ్రహించిన మాగంటి…. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. తాను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ మాట మాత్రం చెప్పకుండా పక్కన…
Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుమారు7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ED అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని రికార్డ్ చేశారు.. కొన్ని రికార్డ్ చేయకుండా వదిలేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు.