GVL Narasimha Rao: జీవీఎల్ హాట్కామెంట్స్.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు..!
- జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్..
- ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉంది..
- కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..?
- విభజన సమయంలో ఏపీ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు.. 10 ఏళ్లు ఏపీ ప్రజలు ఇచ్చిన సీట్లతో అధికారం చేసి రాష్ట్రం గొంతు నులిమేశారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామంగా అభివర్ణించారు.
Read Also: Paris Olympics: నీరజ్ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్పై 30 దేశాలు దాటి పారిస్ కు
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
రాష్ర్ట విభజన తర్వాత ఏపీ నష్ట పోవడానికి.. రాజధాని లేకపోవడమే కారణం అన్నారు జీవీఎల్.. వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం అన్న ఆయన.. ప్రధానిని కీలు బొమ్మను చేసి జనపథ్ నిర్ణయాలు అమలు చేసిన రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదు.. అసెంబ్లీ, పార్లమెంట్ అయినా 10 శాతం సీట్లు రాకపోతే హోదా రాదు అంటూ వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు.. ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదన్నారు.. కోర్టుకు ఎవరైనా వెళ్లవచ్చు.. కానీ, పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో పెద్దగా జోక్యం వుంటుందని అనుకోవడం లేదన్నారు.. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది అతి ఆలోచన.. రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు..
Read Also: Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?
ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది… క్రైసిస్ మేనేజ్ మెంట్ టీమ్ నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు మాజీ ఎంపీ జీవీఎల్.. 3100 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్ విధానంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉందన్నారు.. మరోవైపు.. నాపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరి దగ్గరైనా నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా.. లేదంటే మాపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!