Paris Olympics: నీరజ్ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్పై 30 దేశాలు దాటి పారిస్ కు
- దాదాపు రెండేళ్లుగా సైకిల్ యాత్ర
- రళ నుంచి ఫ్రాన్స్ రాజధానికి చేరుకున్న నీరజ్ చోప్రా వీరాభిమాని
- 15 ఆగస్టు 2022న యాత్రం ప్రారంభం
- పారిస్ ఒలింపిక్స్ కు ఆహ్వానించిన నీరజ్ చోప్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు రెండేళ్లుగా సైకిల్ పై కేరళ నుంచి ఫ్రాన్స్ రాజధానికి చేరుకున్నాడు ఓ అభిమాని. భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు ఈ యువకుడు వీరాభిమాని. ఈయన పేరు ఫైస్ అస్రఫ్ అలీ.. 15 ఆగస్టు 2022న కేరళలోని కాలికట్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 22,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 30 దేశాలు పర్యటించి పారిస్ చేరుకున్నాడు. అలీ ‘శాంతి,ఐక్యత’ సందేశంతో భారతదేశం నుంచి లండన్కు సైక్లింగ్ మిషన్కు బయలుదేరాడు.
READ MORE: Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ క్రమంలో 17 దేశాల్లో సైకిల్ తొక్కిన అనంతరం గతేడాది ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం బుడాపెస్ట్ లో ఆగినప్పుడు నీరజ్ అక్కడే ఉంటున్నట్లు తెలిసింది. అలీ కేరళకు చెందిన ప్రముఖ కోచ్కి ఫోన్ చేసి భారత జట్టును కలవాలని కోరాడు. అప్పుడే అలీకి నీరజ్ను కలిసే అవకాశం వచ్చింది. లండన్ వెళ్తున్నప్పుడు ఒలింపిక్స్ కోసం పారిస్ ఎందుకు రాకూడదని నీరజ్.. అలీని అడిగాడు. ప్లేయస్ ఆహ్వానం మేరకు అలీ తన ప్లాన్ని కాస్త మార్చుకుని పారిస్ వెళ్లేందుకు అవసరమైన వీసా సంపాదించాడు.
READ MORE: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!
నీరజ్ని పారిస్కు ఆహ్వానించారు..
‘ఇండియా హౌస్’లో తన పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఫైస్ అస్రఫ్ అలీ మాట్లాడుతూ.. “భారత అథ్లెట్లతో మాట్లాడటానికి నాకు కొన్ని నిమిషాలు సమయం దొరికింది. పారిస్ ఒలింపిక్స్ కి రామ్మని నీరజ్ నన్ను ఆహ్వానించాడు. ఆయన్ను మళ్లీ పారిస్లో కలవడం గొప్ప అవకాశంగా భావించాను. కాబట్టి నేను నా ప్రణాళికలను కొంచెం మార్చుకున్నాను. అవసరమైన వీసాను పొందాను. అతను మళ్లీ చరిత్ర సృష్టించడం చూడటానికి నేను వచ్చాను. ” అని పేర్కొన్నాడు.
READ MORE: Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..
అలీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ ఏ హోటల్లోనూ ఉండను. మధ్యమధ్యలో వీసా ఏర్పాటు చేసుకోవడానికి రెండు సార్లు కేరళ వెళ్లాల్సి వచ్చింది. సరిహద్దు దాటడానికి మాకు వీసా మాత్రమే అవసరం. సైక్లిస్ట్కు ఇతర పత్రాలు ఏవీ అవసరం లేదు.’ అని తెలిపాడు. ఈ కాలంలో అలసట లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొన్నారా అని అలీని అడిగినప్పుడు.. అలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదని చెప్పాడు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!