Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. 4 వేల మంది కార్మికులు ఔట్..!
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం..
- ఓవైపు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు..
- కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం..
- నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్..
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.. ఓవైపు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది.. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ కానున్నారు.. స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది.. బయో మెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు తొలగించారు.. బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్ ఇచ్చారు.. దీని కోసం 14 వేల కోట్లు కేటాయించిన RINL. ఇక, 500 మందిని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, ఇదంతా ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నంగా చెబుతోంది ఆర్ఐఎన్ఎల్.. కానీ, మరోసారి ఆందోళన బాటపట్టాయి కార్మిక సంఘాలు.. నేడు ట్రైనింగ్ సెంటర్ దగ్గర భారీ ధర్నాకు పిలుపునిచ్చారు..
Read Also: Megastar Chiranjeevi: మెగాస్టార్ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
Also Read
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
అయితే.. వైజాగ్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందంటూ వార్తలు వచ్చాయి.. కార్మిక పోరాటాలు, పొలిటీకల్ లాబీయింగ్ స్టీల్ ప్లాంట్ పరి రక్షణ దిశగా కీలకంగా మారాయని.. దీంతో తెగనమ్మేయాలనే ఆలోచనలకు ఎన్డీఏ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టే దిశగా దృష్టిసారించిందని.. ఆ దిశగా RINLను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తారనే సంకేతాలు బలంగా వినిపించాయి.. కాగా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉద్యమనాదమైన వేళ అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 32 మంది ప్రాణాలు అర్పించిన ఫలితంగా ఏర్పాటైన ఈ భారీ పరిశ్రమ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని నిలబడింది. అందుకే వైజాగ్ స్టీల్ అంటే ఒక ఇండస్ట్రీ కాదు సెంటిమెంట్.. ఆర్ధిక నష్టాల్లోకి నెట్టివేయబడిన ప్రతీసారీ సంక్షోభం నుంచి బయటపడి త న మనుగడను కాపాడుకుంటూనే వుంది. ఆ దిశగా సవాళ్లు, సమస్యలను అధిగమించి స్టీల్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్ధానం సాధించింది ఈ భారీ పరిశ్రమ. కాగా, ఇప్పుడు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కార్మికులు.. వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి..
తాజావార్తలు
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!