Akkineni Nagarjuna: గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ.. విషయం ఇదే..!
- మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ..
- షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన అక్కినేని నాగార్జున..
- ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు..
- ఇంటికి వెళ్లి పరామర్శించిన నాగార్జున..
- తాజా పరిణామాలపై మాట్లాడేందుకు నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు.. అయితే, ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు.
కాగా, తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. మధ్యలోకి అక్కినేని ఫ్యామిలీని లాగిన విషయం విదితమే.. కేటీఆర్ వల్లే.. హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించిన ఆమె.. హీరోయిన్లు కొంతమంది కేటీఆర్ వల్లే త్వరగా పెళ్లిచేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున.. అమల, చైతన్య, అఖిల్తో పాటు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, నాని, వెంకటేష్ సహా ఇలా చాలా మంది సెలబ్రిటీలు.. టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారు.. రాజకీయ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.. మరోవైపు.. కొండా సురేఖ ఈ వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గారు.. సమంతకు క్షమాపణలు చెప్పారు.. ఇక, హీరో నాగార్జున.. కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.. కానీ, ఈ పరిణామాలపై మాత్రం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, ఈ భేటీకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది..
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
తాజావార్తలు
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!