Akkineni Nagarjuna: గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ.. విషయం ఇదే..!
- మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ..
- షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన అక్కినేని నాగార్జున..
- ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు..
- ఇంటికి వెళ్లి పరామర్శించిన నాగార్జున..
- తాజా పరిణామాలపై మాట్లాడేందుకు నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు.. అయితే, ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు.
కాగా, తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. మధ్యలోకి అక్కినేని ఫ్యామిలీని లాగిన విషయం విదితమే.. కేటీఆర్ వల్లే.. హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించిన ఆమె.. హీరోయిన్లు కొంతమంది కేటీఆర్ వల్లే త్వరగా పెళ్లిచేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున.. అమల, చైతన్య, అఖిల్తో పాటు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, నాని, వెంకటేష్ సహా ఇలా చాలా మంది సెలబ్రిటీలు.. టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారు.. రాజకీయ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.. మరోవైపు.. కొండా సురేఖ ఈ వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గారు.. సమంతకు క్షమాపణలు చెప్పారు.. ఇక, హీరో నాగార్జున.. కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.. కానీ, ఈ పరిణామాలపై మాత్రం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, ఈ భేటీకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది..
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!