Akkineni Nagarjuna: గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ.. విషయం ఇదే..!
- మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో నాగార్జున భేటీ..
- షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన అక్కినేని నాగార్జున..
- ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు..
- ఇంటికి వెళ్లి పరామర్శించిన నాగార్జున..
- తాజా పరిణామాలపై మాట్లాడేందుకు నిరాకరణ..
Akkineni Nagarjuna: సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు.. అయితే, ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు.
కాగా, తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. మధ్యలోకి అక్కినేని ఫ్యామిలీని లాగిన విషయం విదితమే.. కేటీఆర్ వల్లే.. హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించిన ఆమె.. హీరోయిన్లు కొంతమంది కేటీఆర్ వల్లే త్వరగా పెళ్లిచేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున.. అమల, చైతన్య, అఖిల్తో పాటు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, నాని, వెంకటేష్ సహా ఇలా చాలా మంది సెలబ్రిటీలు.. టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారు.. రాజకీయ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.. మరోవైపు.. కొండా సురేఖ ఈ వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గారు.. సమంతకు క్షమాపణలు చెప్పారు.. ఇక, హీరో నాగార్జున.. కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.. కానీ, ఈ పరిణామాలపై మాత్రం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, ఈ భేటీకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది..
Also Read
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!