Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Anita Vangalapudi Said That More Than 60000 Rations Have Been Distributed In Three Days

Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్

NTV Telugu Twitter
Published Date :September 8, 2024 , 3:23 pm
By RAMAKRISHNA KENCHE
  • ఈ మూడు రోజుల్లో 60 వేల మందికి పైగా రేషన్ పంపిణీ
  • ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం
  • ఇప్పటికే 20 వేల ఇళ్లకు పైగా శుభ్రం
  • రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు
Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ..  42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ మూడు రోజుల్లో 60 వేల మందికి పైగా రేషన్ పంపిణీ జరిగిందని.. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఫైర్ ఇంజన్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను శుభ్రం చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇప్పటికే 20 వేల ఇళ్లకు పైగా శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. 42 డ్రోన్ల సహాయంతో క్లోరినేషన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. వీటి సాయంతో లక్ష మందికి పైగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. గత ముఖ్యమంత్రులు వరద ప్రాంతాల్లో ఒక్కరోజు మాత్రమే పర్యటించి వెళ్ళిపోయేవారని విమర్శించారు. సీఎం చంద్రబాబు హ్యుమానిటీ యాంగిల్ లో కూడా ఆలోచించి పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని కొనియాడారు.

READ MORE: Trinamool Congress: టీఎంసీ ఎంపీ రాజీనామా.. మమతా బెనర్జీ తీరుని సహించలేకే..

కుటుంబాన్ని, పండుగలను కూడా పక్కనపెట్టి సీఎం చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఉండి అంతా పర్యవేక్షిస్తున్నారన్నారు. చిన్నపిల్లలు కూడా వారి కిడ్డీ బ్యాంకుల్లో డబ్బులు తీసి విరాళాలు ఇస్తున్నారని.. కానీ గత ప్రభుత్వ నాయకులు బెంగళూరులో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో 8 రోజులుగా వరద ప్రభావం ఉంటే గత ప్రభుత్వ నాయకుడు వచ్చి ఇక్కడ 20 నిమిషాలు మాత్రమే ఉన్నారని విమర్శించారు. మంత్రి నిమ్మల రామానాయుడు నిద్రాహారాలు మాని 3 రోజులుగా బుడమేరు దగ్గరే ఉండి అంతా సమీక్షించారని తెలిపారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉన్నారన్నారు. గణేష్ మండపాలకు సంబంధించిన జీవోపై మంత్రి స్పందించారు. 2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చింది.. తాము ఆ జీవోలో ఉన్న దానిని చెప్పామని స్పష్టం చేశారు. కానీ, సింగిల్ విండో విధానంలోనే గణేష్ మండపాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని.. గత ప్రభుత్వ జీవోలో ఉన్న అంశాలను సీఎం దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు.

READ MORE:Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు

ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం ఆదేశాలను మేము 10 రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించామని మంత్రి గుర్తు చేశారు. గణేష్ మండపాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదన్నారు. మైక్ పర్మిషన్ కు కూడా డబ్బులు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లకు సంబంధించి సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anita Vangalapudi
  • ap floods
  • ap floods damage
  • disaster management
  • estimating the heavy rains

తాజావార్తలు

  • Off The Record: హిట్‌ లిస్ట్‌లో జోగి రమేష్‌..! వెంటాడుతున్న ఆ కేసులు ఏంటి..?

  • Bengaluru Stampede: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం.. RCB, KSCA ప్రకటన..!

  • Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. ఎగ్జాట్లీ ఏ సమయంలో జరిగిందంటే..?

  • Off The Record: వైసీపీలో వెన్నుపోటు రాజకీయాలు..! తోపుదుర్తి ఆ మాట ఎందుకన్నారు ?

  • Off The Record: బీఆర్ఎస్ పార్టీకి కవిత గుడ్ బై చెప్పిందా..? ఇక ఒంటరి పోరాటమే..?

ట్రెండింగ్‌

  • Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్‌ వెర్నా SX+ లాంచ్..!

  • Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!

  • Poco F7: అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7..!

  • Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!

  • Auto Driver: వాటే ఐడియా సర్‌జీ.. ఆ చిన్న పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions