Jackal attack: యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు.. దాడిలో 12 మంది గాయాలు..
- యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు..
- ఇప్పటికే తోడేళ్ల దాడిలో 8 మంది మృతి..
- తాజాగా పిలిభిత్లో నక్కల దాడి..
- 12 మందికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jackal attack: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తోడేళ్ల దాడులు కలవరపెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు బహ్రైచ్ జిల్లాలో వరసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. జూలై నుంచి ఇప్పటి వరకు 8 మందిని చంపేశాయి. ఇందులో ఏడుగురు పిల్లలే ఉన్నారు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్స్ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 200 మంది అటవీ, పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించినప్పటికీ, దాడులు ఆగడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది.
Read Also: Deepika Singh : పండగవేళ పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకునే..
Also Read
- Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
- TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
ఇదిలా ఉంటే, ఇప్పటికే తోడేళ్ల దాడుల వార్తలు సంచలనంగా మారిన వేళ, నక్కలు కూడా దాడులకు తెగబడుతున్నాయి. రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో రెండు గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి. ఐదుగురు చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులుపై నక్కలు మొదటి దాడి చేశాయి. చిన్నారులను రక్షించేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా అటాక్ చేశాయి.
దాడి తర్వాత గాయపడిన మొత్తం 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది. నక్కల దాడిలో కోపోద్రిక్తులైన స్థానికులు అందులో ఒక దానిని చంపారు. నక్కల దాడి గురించి తెలిసిన వెంటనే స్థానిక అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తుున్నారు. నక్కల దాడిపై పిలిభిత్ ఎంపీ జతిన్ ప్రసాద అధికారులతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!