Jackal attack: యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు.. దాడిలో 12 మంది గాయాలు..
- యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు..
- ఇప్పటికే తోడేళ్ల దాడిలో 8 మంది మృతి..
- తాజాగా పిలిభిత్లో నక్కల దాడి..
- 12 మందికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jackal attack: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తోడేళ్ల దాడులు కలవరపెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు బహ్రైచ్ జిల్లాలో వరసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. జూలై నుంచి ఇప్పటి వరకు 8 మందిని చంపేశాయి. ఇందులో ఏడుగురు పిల్లలే ఉన్నారు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్స్ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 200 మంది అటవీ, పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించినప్పటికీ, దాడులు ఆగడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది.
Read Also: Deepika Singh : పండగవేళ పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకునే..
Also Read
- PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
ఇదిలా ఉంటే, ఇప్పటికే తోడేళ్ల దాడుల వార్తలు సంచలనంగా మారిన వేళ, నక్కలు కూడా దాడులకు తెగబడుతున్నాయి. రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో రెండు గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి. ఐదుగురు చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులుపై నక్కలు మొదటి దాడి చేశాయి. చిన్నారులను రక్షించేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా అటాక్ చేశాయి.
దాడి తర్వాత గాయపడిన మొత్తం 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది. నక్కల దాడిలో కోపోద్రిక్తులైన స్థానికులు అందులో ఒక దానిని చంపారు. నక్కల దాడి గురించి తెలిసిన వెంటనే స్థానిక అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తుున్నారు. నక్కల దాడిపై పిలిభిత్ ఎంపీ జతిన్ ప్రసాద అధికారులతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Jyoti Venkatesh: అవును, రామ్గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!