Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Fires On Ap Govt And Cm Chandrababu

YS Jagan: ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? వైఎస్‌ జగన్‌ ఫైర్‌

Published Date :August 6, 2024 , 7:30 pm
By Sudhakar Ravula
  • ఏపీ సర్కార్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్..
  • చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది..
  • వైసీపీ నేతలు.. కార్యకర్తలపై టీడీపీ వారు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని ఆవేదన..
  • టీడీపీని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తుందని హెచ్చరిక..
YS Jagan: ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? వైఎస్‌ జగన్‌ ఫైర్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్‌ అయ్యారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుడు శ్రీనివాసరావును పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వారు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. దాడులు చేసి ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదన్న ఆయన.. ఇలాంటి కిరాతకాలు దారుణాలతో ప్రజలను ఎవరూ భయపడరు.. ఇదంతా ప్రజల్లో కోపంగా మారి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తుందని హెచ్చరించారు.

Read Also: Store Ginger Garlic: అల్లం వెల్లుల్లి చాలా రోజులు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

చంద్రబాబు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుందన్నారు వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుభరోసా ఎగరగొట్టారు.. బడులకు పోయే పిల్లలకు అమ్మఒడి ఇవ్వకుండా తల్లులను మోసం చేశారు.. 18ఏళ్లు నిండిన మహిళలలకు ఆర్థిక సాయం చేస్తామని ఇంకా ఇవ్వలేదు.. ఫీజు రీఎంబర్స్ మెంట్ , వసతి దీవెన బకాయిలు ఇంకా ఇవ్వలేదు.. మహిళలకు ఇవ్వాల్సిన సున్నావడ్డీ, మత్స్యకార భరోసా ఎగొట్టారు.. పథకాలు అమలు చేయకుండా స్కూళ్లు, చదువులు నిర్వీర్యం చేశారు అంటూ విమర్శలు గుప్పించారు.

Read Also: Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఎజెండా.. జైశంకర్, అజిత్ దోవల్‌ని కలిసిన అమిత్ షా..

ఇక, భయాందోళలనలు గురిచేస్తూ కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవాలని చంద్రబాబు ఆదేశిస్తున్నారు అని ఆరోపించారు వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు ఓ సారి ఆలోచించు.. చెడు సాంప్రదాయం.. కొనసాగితే చాలా నష్టపోతారు.. చాలా వేగంగా ఈ ప్రభుత్వం తుడిచి పెట్టుకు పోతుంది.. మా ప్రభుత్వం వస్తే టీడీపీ వారికి ఇదే జరిగేలా బీజం వేస్తున్నారు.. తప్పుడు సాంప్రదాయాలు వెంటనే ఆపేయాలని వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి.. దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను అన్నారు. శుక్రవారం నంద్యాలకు వెళ్తున్నా.. అక్కడ దాడికి గురైన బాధితుడిని పరామర్శిస్తా.. దాడులపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం అన్నారు. దాడులపై ఇప్పటికే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం.. రాష్ట్రంలో రాష్ట్ర పతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.. రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదని అడుగుతున్నా..? రాష్ట్రపతి పాలన కోసం కలుగ చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ను కోరుతున్నాను.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం రాష్ట్ర గవర్నర్ కు ఉంది.. గవర్నర్ చూసీ చూడనట్లుగా పోవద్దని విజ్ఞప్తి చేశారు వైఎస్‌ జగన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Govt.
  • cm chandrababu
  • tdp
  • ys jagan

తాజావార్తలు

  • Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్

  • Pakistan Cricket: పాక్ జట్టులో కలకలం.. కోచింగ్, కెప్టెన్సీలపై కీలక నిర్ణయం..!

  • Trump-China: హార్ముజ్ తెరిచి ఉంచాం.. చైనా సంతోషంగా ఉందన్న ట్రంప్

  • Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

  • INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన

ట్రెండింగ్‌

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions