Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎంపీ హర్షం
- విజయవాడ ఉత్సవ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- ఆలయ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్..
- ఆ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Utsav: వైబ్రంట్ విజయవాడ ఉత్సవాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బెజవాడ దుర్గ గుడి భూముల్లో వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ పేరుతో వాణిజ్య కార్యకలాపాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. కేసు విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం.. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. విజయవాడ ఉత్సవ్ కు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి అన్నారు.. అమ్మవారి ఆశీస్సులతో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ నెల 24వ తేదీ నుంచి ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.. అయితే, కృష్ణా నది వరద ఉధృతి కారణంగా వాటర్ స్పోర్ట్స్ రద్దు చేశాం అని వెల్లడించారు.. కానీ, వరద ఉధృతి తగ్గాక వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు ఎంపీ కేశినేని చిన్ని..
Read Also: Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
కాగా, దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది.. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా.. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. కానీ, ఈ వ్యవహారంపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ విషయంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు..
తాజావార్తలు
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!