Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా వెలుగులు నింపిన ఈ మహానటుడు, నేడు తన సినీ ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయిని చేరుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరు ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు..‘22 సెప్టెంబర్ 1978.. నేను నటుడిగా మీ ముందుకు వచ్చాను. ప్రాణం ఖరీదు ద్వారా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, చివరికి మెగాస్టార్గా నిలిపింది మీ ప్రేమే. నేటికి 155 సినిమాలను పూర్తి చేసుకున్నాను అంటే అది మీ నిస్వార్థమైన అభిమానం వల్లే సాధ్యమైంది. ఈ 47 ఏళ్లలో నేను అందుకున్న అవార్డులు, గౌరవాలు అని మీవే. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి’’ అని చిరు అభిమానుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Bad Girl: ‘బ్యాడ్ గర్ల్’ అశ్లీలం కాదు..వివాదం పై స్పందించిన వార్షా భరత్
Also Read
- Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
- Tollywood Pan World Movies: అందరికీ 'పాన్ వరల్డ్ మూవీ'నే కావాలా?
- Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
- Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
1978, సెప్టెంబర్ 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) అనే యువకుడు ప్రాణం ఖరీదు ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కె. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రలో నటించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ వంటి ప్రముఖులతో కలిసి తెరపై కనిపించిన ఆయన, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే – చిరు కథానాయకుడిగా తొలుత చేసిన చిత్రం పునాది రాళ్లు. కానీ, షూటింగ్ త్వరగా పూర్తి అయిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదల కావడం, ఆయన కెరీర్లో చారిత్రాత్మక మలుపుగా మారింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు – అనిల్ రావిపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. విశ్వంభర – దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకులను అలరించ నుంది. వీటితో పాటు శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరో రెండు సినిమాలు లైనప్లో ఉన్నాయి.
మొత్తానికి ప్రాణం ఖరీదు తో మొదలైన ప్రయాణం నేడు 47 ఏళ్ల కు చేరుకుంది.ఆయన ప్రతి అడుగు ఒక కొత్త తరానికి ప్రేరణ. అభిమానుల మద్దతుతో ముందుకు సాగుతున్న మెగాస్టార్ రాబోయే ప్రాజెక్టులతో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ, తెలుగు సినీ లోకమంతా ఆనందోత్సాహాలతో శుభాకాంక్షలు తెలుపుతోంది.
22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?