Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Suspense Continues In The Ayesha Meera Murder Case

Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో కొనసాగుతోన్న సస్పెన్స్..! మళ్లీ అనుమానాలు..?

Published Date :June 28, 2025 , 4:31 pm
By Sudhakar Ravula
  • బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మిస్టరీ..
  • 17 ఏళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన ఆయేషా మీరా..
  • ఇంకా నిందితులు ఎవరు అనేదానిపై సస్పెన్స్..
Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో కొనసాగుతోన్న సస్పెన్స్..! మళ్లీ అనుమానాలు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఆయేషా మీరా హత్య కేసు 17 ఏళ్ల నుంచి అనేక మలుపులు తిరుగుతూ ఇంకా మిస్టరీగానే మిగిలింది. 2007 డిసెంబరు 27న రాత్రి ఇబ్రహీంపట్నంలో దుర్గా లేడీస్ హాస్టల్ లో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా అత్యాచారం, హత్యకు గురైంది. ఆయేషామీరాను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి బాత్ రూమ్ లో మృతదేహాన్ని వదిలి నిందితుడు పరారయ్యాడు. మృతదేహంపై చిరుత అని కూడా రాసి వెళ్లాడు. జాతీయ రహదారిపై హాస్టల్ ఉండటంతో హత్య చేసి హైవేపైకి వెళ్లి పరారాయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. కేసును విచారించి విజయవాడ పోలీసులు దర్యాప్తులో భాగంగా దాదాపు 150 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. సంఘటన జరిగిన తర్వాత ఏడాది కాలానికి.. 2008 ఆగస్టులో నందిగామకు చెందిన సత్యంబాబును అరెస్టు చేశారు. సత్యంబాబు.. ఆయేషా మీరాను అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు కోర్టుకు ఛార్జిషీట్ లో నివేదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు.. సత్యంబాబుకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సత్యంబాబు 2010లో హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. విచారణ జరిగిన డివిజన్ బెంచ్ 2017 మార్చి 31న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది.

Read Also: Samsung Galaxy M36: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో సామ్ సాంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు

Also Read

  • V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభ‌జ‌న హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
  • YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్‌ జగన్‌ మాజీ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్..
  • Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
  • Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!

మొదటి నుంచి కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు సత్యంబాబు ఈ కేసులో నిందితులు కాదని దర్యాప్తు అధికారులకు చెబుతూనే వచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ సహా పలువురిపై ఆయేషా మీరా తల్లి షంషద్ బేగం అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యంబాబు ఈ హత్య కేసులో తొమ్మిదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఆయేషా మీరా హత్య కేసు సరిగా విచారణ చేయటంలేదని అయేషా తల్లి షంషద్ బేగంతోపాటు ముగ్గురు మహిళా హక్కుల యాక్టివిస్టులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దర్యాప్తు పూర్తి నివేదిక పరిశీలించి అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అప్పటి ప్రభుత్వం ఆయేషా మీరా హత్యపై సిట్ ను ఏర్పాటు చేసింది. దీనికి నాటి విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వం వహించారు. సిట్ దర్యాప్తు సక్రమంగా సాగక పోవడంతో ఆయేషా తల్లి హైకోర్టును ఆశ్రయించారు. సిట్ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను 2018 నవంబర్ లో అప్పగించింది. ఆధారాల ధ్వంసం విషయాన్ని సిట్ అధికారులు హైకోర్టుకు తెలపడంతో విచారణకు ఆదేశించింది. దీంతో 2018 నుంచి 2025 వరకు ఏడేళ్లపాటు సుదీర్ఘ విచారణ జరిపి చివరికి తుది నివేదికను ఇటీవల హైకోర్టుకు అందజేసింది. ఈ రిపోర్ట్ ను తమకు ఇవ్వటంలేదని తాజాగా ఏపీ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.

Read Also: Union Minister Rammohan Naidu: ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన.. ఆ సంస్కృతి మాది కాదు..!

2018లో రీ ఇన్వెస్టిగేషన్ ను సీబీఐ మొదలుపెట్టింది. ఆయేషామీరా హత్య, దిగువ కోర్టులో ఆధారాల మాయంపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఏడేళ్ల దర్యాప్తులో 260 మంది సాక్షులను విచారించింది. 2610 డాక్యుమెంట్స్ సీజ్ చేసింది. అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన 50 మంది పోలీసులు, ఆయేషా ఉన్న హాస్టల్లోని విద్యార్థులు, సిబ్బంది 25 మందిని సీబీఐ పిలిపించి ప్రశ్నించింది. ఆయేషామీరా తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన కోనేరు సతీష్, చింతా పవన్ కుమార్, అబ్బూరి గణేష్, హాస్టల్ వార్డెన్ పద్మను విచారించారు. విదేశాల్లో ఉన్న వారిని కూడా పిలిపించి సీబీఐ విచారించింది. కోర్టు నిర్ధోషిగా తేల్చిన సత్యంబాబును నందిగామ సమీపంలోని సత్యంబాబు స్వగ్రామం అనాసాగరం వెళ్లి క్షుణ్నంగా విచారించారు. ఆయేషా మీరా స్వస్థలం తెనాలి కూడా సీబీఐ బృందం విచారణ చేపట్టింది. ఆయేషాను ఖననం చేసిన ప్రాంతంలో తవ్వి.. అస్తికలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్.. గాంధీ వైద్య కళాశాలలో రీపోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలూ చేయించారు. దిగువ – కోర్టులో ఆధారాలను ధ్వంసం చేసిన అభియోగాలు ఎదుర్కొన్న సిబ్బంది వెంకట కుమార్, సుబ్బారెడ్డి, కుమారిలను సుదర్ఘంగా విచారించారు. ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాల మేరకు దీనికి పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నించారు.

Read Also: Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..

సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్య కేసుపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ చేపట్టినా ఏడేళ్లకు తుది నివేదికను హైకోర్టుకు ఇచ్చింది. ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో నివేదికను హైకోర్టు సూచనతో విజయవాడలోని సీబీఐ కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో సమర్పించింది. 17 ఏళ్ల కిందట జరిగిన ఘటనపై సీబీఐ పునర్‌ దర్యాప్తులో ఏం తేల్చిందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నివేదిక ప్రతి కోసం ఆయేషా తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. బాధితులుగా ఉన్న తమకు నివేదిక కాపీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నివేదికలో నిందితులు ఎవరు, సత్యంబాబు పాత్ర గురించి ఏం తేల్చింది అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. గతంలో ఆయేషా మీరా తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన వారి పాత్ర ఉందా లేక వేరే వారు హత్య చేసినట్టు నిర్ధారించారా? అనేది రిపోర్టులో ఉంది. ఈ నివేదిక బయటకు వస్తే కానీ అసలు విషయాలు తెలిసే అవకాశాలు లేవు. రిపోర్టు చూసిన తర్వాత దానిపై కూడా అనుమానాలు ఉంటే భవిషత్యు కార్యాచరణ ఉంటుందని అయేషా మీరా తల్లిదండ్రులు చెబుతున్నారు. విచారణ పేరుతో సీబీఐ తనను ఇబ్బంది పెడుతోందని, తుది నివేదిక ద్వారాపైనా దాని నుంచి బయట పడతానని సత్యంబాబు చెబుతున్నారు. సీబీఐ తుది నివేదక ద్వారాపైనా ఆయేషా మీరా హత్య కేసు మిస్టరీ వీడుతుందో ఇంకా కొనసాగుతుందో చూడాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ayesha meera case
  • Ayesha Meera Murder Case
  • CBI
  • police

తాజావార్తలు

  • Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..

  • Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!

  • IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..

  • Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?

  • BMW F 450 GS: భారత్ లో కొత్త BMW F 450 GS విడుదల.. పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు & ధరలు

ట్రెండింగ్‌

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions