AP BJP New President: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆయనకే.. రేపే అధికారిక ప్రకటన..
- ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..
- నామినేషన్ల దాఖలుకు ముగిసిన గడువు..
- నామినేషన్ దాఖలు చేసిన ఒకేఒక్కరు మాధవ్..
- రేపు ఏపీ బీజేపీ అధ్యక్షుడి పేరు అధికారికంగా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP New President: ఆంధ్రప్రదేశ్లో కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడిందనే చెప్పాలి.. నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మాధవ్..
Read Also: MLA Raja Singh: టీడీపీ నుంచి బీజేపీకి.. రాజా సింగ్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి..
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
ఇక, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను రేపు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు.. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం.. అయితే, ఈ రోజు మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడవు ముగిసింది.. పీవీఎన్ మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.. ఒకే నామినేషన్ వేయడంతో దాదాపు ఏపీ బీజేపీ చీఫ్ పేరు ఖరారైనట్టే.. దీనిపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఎన్ మాధవ్ దాఖలు చేసారు.. పీసీ మోహన్, పాకా సత్యనారాయణ ఎన్నికలు నిర్వహించారు.. రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు.. ఇవాళ నామినేషన్లు స్క్రూటినీ జరుగుతుంది.. రేపు అధ్యక్షుని ప్రకటన జరుగుతుందన్నారు సోము వీర్రాజు..
Read Also: Control Room: ప్రమాద బాధితుల సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
ఇక, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. పీవీఎన్ మాధవ్ కు అనుకూలంగా ఐదు సెట్లు నామినేషన్ వేసారు.. ఒకే నామినేషన్ వేసారు గనుక ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.. టెక్నికల్ గా రేపు పీవీఎన్ మాధవ్ అధ్యక్షుడుగా ప్రకటించబడతారు అని తెలిపారు.. మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేసారు.. ఉత్తరాంధ్ర వ్యక్తి మాధవ్.. ఆయన తల్లి మాధవ్ను చంకలో పెట్టుకుని ఎమర్జెన్సీలో జైలుకెళ్లారని గుర్తుచేశారు.. బీజేపీ బీసీలకు పెద్దపీట వేసినట్టు భావించచ్చు.. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ కు మా సహకారం ఉంటుంది.. కూటమిలో ఉంటూనే పటిష్టం కావడానికి పని చేయాల్సిన బాధ్యత అధ్యక్షుడిపై ఉంటుందన్నారు విష్ణుకుమార్ రాజు..
Read Also: All-Time XI: టీ20 ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!
కాగా, పీవీఎన్ మాధవ్కు బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఎమ్మెల్సీగా.. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుటుంబం కూడా పార్టీ కుటుంబంగానే చెప్పుకోవాలి.. మరోవైపు.. రేపు ఉదయం 9 గంటలకు బెజవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకోబుతున్నారు ఏపీ బీజేపీ కాబోయే నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అమ్మవారి దర్శనం అనంతరం స్ధానిక కన్వెన్షన్ లో జరిగే పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు..
తాజావార్తలు
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!