Minister Satya Kumar Yadav: ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. మంత్రి సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు
- తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు..
- కేసీఆర్.. జగన్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపణ..
- రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శలు..
- సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు.. రేవంత్ రెడ్డి భేటీ కావడం అభినందనీయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: విభజన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుంబిగించారు.. అందులో భాగంగా.. ఈ రోజు హైదరాబాద్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం కాబోతున్నారు.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. గతంలో కేసీఆర్, జగన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించిన ఆయన.. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.. అయితే, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు భేటీ కావడం అభినంద నీయం.. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10 అంశాల మీద మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
Also Read
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
ఇక, చంద్రబాబు లెటర్ రాయటం.. రేవంత్ రెడ్డి స్పందించటం బాగుంది అన్నారు మంత్రి సత్యకుమార్.. ఆస్తులు, నీటి పంపకాలు, ఉద్యోగుల పంపకాలపై స్నేహ పూర్వక చర్చ జరగనుంది.. రాజకీయాలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ఉన్న అంశాలపై చర్చకు ముందుకు రావటం అభినందనీయం అన్నారు. మొదట ఐదేళ్ళపాటు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ఏపీకి అండగా నిలిచింది.. కేసీఆర్, జగన్ ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంపై స్పందన లేకపోవటంతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. ప్రస్తుత సమావేశం ద్వారా ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు. విభజన చట్ట ప్రకారం మాత్రమే ఆస్తులు, ఆదాయ, సహజ వనరుల పంపకాలు జరగాలి.. అంతేకాదు.. చట్టం దాటి పెట్టిన డిమాండ్స్ పై చర్చ జరపాలి అన్నారు. రాజకీయాలు పక్కన పెడితే ఏపీకి అన్యాయం జరిగింది అనేది వాస్తవం.. రాజధాని లేదు, ఏపీకి ఆదాయం లేదు, తెలంగాణకు మిగులు ఆదాయం ఉంది అన్నారు. మరోవైపు.. డిమాండ్స్ పెట్టడం సరికాదు, అత్యాసపరమైన డిమాండ్స్ మంచిదికాదు.. పరిణితి ఉన్న నాయకత్వం చర్చలు బాగానే జరుగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం మొదటి నుంచి అన్యాయం జరిగిన ఏపీకి అండగా ఉంది.. తర్వాత వైసీపీ అభివృద్ధి నిరోధక చర్యలతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. సమావేశంతో రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!