Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
- గ్రూప్ 2 వాయిదా వేసే ఆలోచనలో సర్కార్..?..
- గ్రూప్ 2.. డీఎస్సీ వెంటవెంటనే ఉండటంతో గ్రూప్ 2 వాయిదా ..
- డిసెంబర్ లో గ్రూప్ 2 ఉండే అవకాశం..!
- ఇవాళ అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-2 Postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది. జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్ 2 నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే వెంటనే గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. డిసెంబర్ లో గ్రూప్ 2 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read also: Imran Khan: నాకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా..
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 పోస్టులను 2000కు, గ్రూప్ 3 పోస్టులను 3000కు పెంచాలని డిమాండ్ చేశారు.గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపికై 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు. దీనిపై నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా.. ఈ రెండింటినీ బ్యాక్ టూ బ్యాక్ నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకపై సీఎం దృష్టి సారించారు.
ఇదే అంశంపై సీఎం కూడా సమావేశంలో చర్చించారు. పరీక్ష తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా పడుతుందా? లేక డీఎస్సీ? వాయిదా పడుతుందా అనే ప్రశ్నలపై నేడు టెన్షన్ వీడిందనే చెప్పాలి. ఎట్టకేలకు ఇవాళ సీఎం రేవంత్ సమీక్షలో గ్రూప్-2 వాయిదా వేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రూప్-2 వాయిదా వేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థలకు ఇది శుభవార్తే అని చెప్పాలి.
GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు..
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!