Home Minister Vangalapudi Anitha: వైసీపీకి హోం మంత్రి అనిత సవాల్.. మేం రెడీ.. మీరు సిద్ధమా..?
- వైసీపీకి హోం మంత్రి వంగలపూడి అనిత సవాల్..
- వరద సాయంపై చర్చకు రావాలని సవాల్..
- వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం..
- వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..?
Home Minister Vangalapudi Anitha: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద సాయంపై చర్చకు రావాలని సవాల్ చేశారు.. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అని చాలెంజ్ చేశారు.. ఎన్టీఆర్ జిల్లాలో రూ. 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశాం. వరద సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసిందే రూ. 139 కోట్లు. అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారు..? అంటూ మండిపడ్డారు.. వరద సాయం అందించడమే కాకుండా.. బుడమేరు గండ్లను పూడ్చేలా మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు. కలెక్టరేట్లో మకాం వేసి రాష్ట్రంలో ఉన్న వరద ప్రాంతాల్లో పరిస్థితి సీఎం చంద్రబాబు సమీక్షించారు.. వార్డులకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. ప్రతి చిన్న అంశాన్ని పట్టించుకున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరైనా ఉంటారా..?ఖాజానా ఖాళీ చేసేసి.. అవినీతి ఖాజానా అంటారా..? ఖాజానాలో సొమ్ముని తన జమానాలోనే జగన్ జమ చేసేసుకున్నారు అంటూ మండిపడ్డారు..
Read Also: Devara: అయ్యో.. మిస్ అయ్యామే! తెగ బాధపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్
Also Read
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
- Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
ఎగ్ పఫ్లకు జగన్ హయాంలో ఖర్చు పెట్టినట్టు కాదు. మా ప్రభుత్వంలో ప్రజల కోసమే ఖర్చు పెడతాం అన్నారు అనిత.. గ్యాస్ స్టవ్వులు కూడా బాగు చేయించిన సీఎం ఎవరైనా ఉంటారా..? సీఎంగా ఉన్నప్పుడు జగన్ హెలీకాప్టరులో వెళ్లేవారు. కానీ, చంద్రబాబు జేసీబీల్లో పర్యటించారు. నీట మునిగిన ప్రతి ఇంటిని కడిగించారు. జగన్ది అంతా ఫేక్ బతుకు.. ఎందుకీ బతుకు..? 11 సీట్లు వచ్చేసరికి జగనుకు చిప్ పోయినట్టుంది. పుంగనూరులో ఓ అమ్మాయిని చంపేస్తే.. నలుగురు రేప్ చేసి చంపేశారని వైసీపీ ప్రచారం చేస్తోంది. తాను చేసే అవినీతే అందరూ చేసేస్తారనే భ్రమలో జగన్ ఉన్నారు అంటూ విరుచుకుపడ్డారు.. మేం పేరు కోసం కాదు.. ప్రజల కోసం పని చేశాం. ప్రజల కోసం పని చేస్తే.. పేరు ఆటోమేటిగ్గా వస్తుందన్నారు.. అయితే, అధికారిక చిహ్నాలను దుర్వినియోగం చేస్తున్నారు.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగులకు.. సర్వే రాళ్లకు, ఎగ్ పఫ్ ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లా మా గురించి మాట్లాడేది..? అంటూ ఎద్దేవా చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?