Taneti Vanita: వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన మొదటి సీఎం వైఎస్ఆర్ అని హోంమంత్రి కొనియాడారు. మహిళా సాధికారత సాధించేలా సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ శాసనసభ్యులను అందరిని గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Kidney Stones: కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన చిట్కాలు..
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే లేవని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైద్యం, విద్య ఆ రోజుల్లో ఖరీదుగా ఉండేవని.. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచితంగా విద్య, వైద్య అందించిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు.
గుండె ఆపరేషన్ల ద్వారా ఎంతోమందికి ప్రాణం పోసిన మహానేత వైఎస్ అని మంత్రి తెలిపారు. వైఎస్ ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గర్వం ప్రదర్శించలేదని.. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ ఎక్కడా గర్వం చూపించరని పేర్కొన్నారు.
పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే జగన్ లక్ష్యమన్నారు.
Read Also: BAN vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తప్పక గెలవాల్సిందే!
జగనన్న మ్యానిఫెస్టోలో 25 లక్షల ఇళ్లిస్తామని ఉంటే ఇప్పటిదాకా 32 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్ధలాలిచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఆర్థిక పరిస్ధితులను తట్టుకుని జగన్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ తన సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని.. మరి ఆనాడు అదే బడ్జెట్ తో టీడీపీ ఎందుకు ఇవ్వలేకపోయిందని మంత్రి ప్రశ్నించారు. అంటే ఆనాడు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి పేదల డబ్బులు అనేది సమాధానం చెప్పాలని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!