Meruga Nagarjuna: ఏపీలో తిరస్కరించబడిన వ్యక్తి చంద్రబాబు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నోటీసులు తీసుకోవటం అలవాటేనని దుయ్యబట్టారు. అవసరమైతే కోర్టులకు వెళ్తాడు.. స్టేలు తెచ్చుకుంటాడని ఆరోపించారు. చంద్రబాబు జీవితంలో స్టేలు.. దొంగతనాలు.. అబద్దాలు.. వెన్నుపోట్లతో ముందుకు వెళ్తున్నాడని తెలిపారు. ఏం జరగాలో అదే ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని మంత్రి మేరుగ పేర్కొన్నారు. ప్రజా బాహుళ్యంలో చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. చంద్రబాబు గుండెల్లో భయం ఉంది.. దాన్ని మేనేజ్ చేసుకుంటున్నాడని అని మేరుగ నాగార్జున అన్నారు.
Read Also: Kushi: ఖుషి సినిమాపై రేటింగ్స్ దాడి.. విజయ్ పై బూతుల వర్షం.. వెనకున్నది వారే?
Also Read
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
చంద్రబాబు తప్పు చేయకుంటే ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పనేం ఉందని మంత్రి ప్రశ్నించారు. పురందీశ్వరినో, ఎవరో ఒకరివో కాళ్లు పట్టుకుని బీజేపీతో లైజనింగ్ చేయించుకుని కలిసి వెళ్లాలని చంద్రబాబు ఆలోచన అని మేరుగ అన్నారు. బీజేపీని అడ్డం పెట్టుకుని ఇరుక్కున్న అంశాల నుంచి బయటకు రావాలని చంద్రబాబు చూస్తున్నాడని మండిపడ్డారు. ఏపీలో తిరస్కరించబడిన వ్యక్తి చంద్రబాబు అని.. టీడీపీ రథచక్రాలు ఊడిపోయాయని, దొంగ ఓట్లకు ఆజ్యుడు చంద్రబాబు అని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Amit Shah: ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోంది.. సీఎం కొడుకు వ్యాఖ్యలపై ఫైర్..
మరోవైపు కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతోనే గెలుస్తున్నాడని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. గత స్థానిక సంస్ధల ఎన్నికలు పకడ్బందీగా జరిగాయి కాబట్టే టీడీపీ ఓడిందని తెలిపారు. వైసీపీ దొంగ ఓట్లు తీసివేయాలని కోరితే చంద్రబాబుకు ఉలుకెందుకు అని ప్రశ్నించారు. టీడీపీకి మరోసారి ఓటమి తప్పదని అర్థమైనందునే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మేరుగ మండిపడ్డారు..
తాజావార్తలు
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!