Gorantla Madhav: జగన్పై దాడి చేయాలనే కుట్ర.. మా అనుమానం అదే..!
- రామగిరిలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం..
- హెలికాప్టర్ను ఇబ్బందులకు గురిచేశారు..
- మార్గమధ్యలో జగన్పై భౌతిక దాడి చేయాలనే కుట్ర..
- తమకు అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. హెలికాప్టర్ను ఇబ్బందులకు గురిచేసి.. మార్గమధ్యలో జగన్పై భౌతిక దాడి చేయాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే అన్నారు.. హోంమంత్రి అనిత మాత్రం.. జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను బందోబస్తులో పెట్టామని చెబుతున్నారని.. 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు..
Read Also: Sai Sudharsan: ఐపీఎల్లో మొదటి బ్యాటర్గా సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
మంత్రి నారా లోకేష్ కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తూ.. వైఎస్ జగన్ కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారని మండిపడ్డారు గోరంట్ల మాధవ్.. రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్.. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పెట్టించుకోక పోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్లిందని విమర్శించారు.. రామగిరి ఎస్సై వ్యవహరించిన తీరుతో పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలన్నారు.. ఆయన బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం హాస్యాస్పదమన్నారు గోరంట్ల మాధవ్.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే.. ఆయనకు మూడంచెల భద్రత అవసరం అన్నారు.. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు.. ప్రజలను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే.. రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు..
Read Also: Rajasthan Royals: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్కు భారీ షాక్!
రామగిరిలో ముత్యాలు అనే వైసీపీ కార్యకర్త ఇంటిపై రాళ్లదాడి జరిగిన సమయంలో నేనే పోలీసులకు సమాచారం ఇచ్చా.. ఘటన సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు కింద పడ్డ రాళ్లను తమ వాహనంలో వేసుకుని వెళ్లారు.. రామగిరి ఎస్సై బాధితుల వాహనాల్లో కత్తులు పెట్టి తిరిగి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు గోరంట్ల మాధవ్.. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు పెట్టించుకోక పోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్ళిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..