Gorantla Madhav: రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. హెలికాప్టర్ను ఇబ్బందులకు గురిచేసి.. మార్గమధ్యలో జగన్పై భౌతిక దాడి చేయాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే అన్నారు.. హోంమంత్రి అనిత మాత్రం.. జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను బందోబస్తులో పెట్టామని చెబుతున్నారని.. 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు..
Read Also: Sai Sudharsan: ఐపీఎల్లో మొదటి బ్యాటర్గా సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!
మంత్రి నారా లోకేష్ కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తూ.. వైఎస్ జగన్ కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారని మండిపడ్డారు గోరంట్ల మాధవ్.. రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్.. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పెట్టించుకోక పోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్లిందని విమర్శించారు.. రామగిరి ఎస్సై వ్యవహరించిన తీరుతో పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలన్నారు.. ఆయన బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం హాస్యాస్పదమన్నారు గోరంట్ల మాధవ్.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే.. ఆయనకు మూడంచెల భద్రత అవసరం అన్నారు.. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు.. ప్రజలను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే.. రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు..
Read Also: Rajasthan Royals: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్కు భారీ షాక్!
రామగిరిలో ముత్యాలు అనే వైసీపీ కార్యకర్త ఇంటిపై రాళ్లదాడి జరిగిన సమయంలో నేనే పోలీసులకు సమాచారం ఇచ్చా.. ఘటన సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు కింద పడ్డ రాళ్లను తమ వాహనంలో వేసుకుని వెళ్లారు.. రామగిరి ఎస్సై బాధితుల వాహనాల్లో కత్తులు పెట్టి తిరిగి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు గోరంట్ల మాధవ్.. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు పెట్టించుకోక పోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్ళిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..