Gorantla Madhav: జగన్పై దాడి చేయాలనే కుట్ర.. మా అనుమానం అదే..!
- రామగిరిలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం..
- హెలికాప్టర్ను ఇబ్బందులకు గురిచేశారు..
- మార్గమధ్యలో జగన్పై భౌతిక దాడి చేయాలనే కుట్ర..
- తమకు అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. హెలికాప్టర్ను ఇబ్బందులకు గురిచేసి.. మార్గమధ్యలో జగన్పై భౌతిక దాడి చేయాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే అన్నారు.. హోంమంత్రి అనిత మాత్రం.. జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను బందోబస్తులో పెట్టామని చెబుతున్నారని.. 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు..
Read Also: Sai Sudharsan: ఐపీఎల్లో మొదటి బ్యాటర్గా సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
మంత్రి నారా లోకేష్ కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తూ.. వైఎస్ జగన్ కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారని మండిపడ్డారు గోరంట్ల మాధవ్.. రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్.. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పెట్టించుకోక పోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్లిందని విమర్శించారు.. రామగిరి ఎస్సై వ్యవహరించిన తీరుతో పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలన్నారు.. ఆయన బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం హాస్యాస్పదమన్నారు గోరంట్ల మాధవ్.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే.. ఆయనకు మూడంచెల భద్రత అవసరం అన్నారు.. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు.. ప్రజలను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే.. రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు..
Read Also: Rajasthan Royals: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్కు భారీ షాక్!
రామగిరిలో ముత్యాలు అనే వైసీపీ కార్యకర్త ఇంటిపై రాళ్లదాడి జరిగిన సమయంలో నేనే పోలీసులకు సమాచారం ఇచ్చా.. ఘటన సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు కింద పడ్డ రాళ్లను తమ వాహనంలో వేసుకుని వెళ్లారు.. రామగిరి ఎస్సై బాధితుల వాహనాల్లో కత్తులు పెట్టి తిరిగి అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు గోరంట్ల మాధవ్.. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు పెట్టించుకోక పోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్ళిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
తాజావార్తలు
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!