Rajasthan Royals: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్కు భారీ షాక్!
- గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఓటమి
- 159 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్
- కెప్టెన్ సహా ఆటగాళ్లందరికీ భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. 218 పరుగుల ఛేదనలో ఆర్ఆర్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.షిమ్రాన్ హెట్మయర్ (52; 32 బంతుల్లో 4×4, 3×6), సంజు శాంసన్ (41; 28 బంతుల్లో 4×4, 2×6) పోరాడారు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8×4, 3×6) దంచికొట్టాడు. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్కు మరో షాక్ తగిలింది. కెప్టెన్ సంజూ శాంసన్ సహా ఆటగాళ్లందరికీ భారీ జరిమానా పడింది.
Also Read: 2028 Olympics: ఒలింపిక్స్లో ఆరు క్రికెట్ టీమ్స్.. అమెరికాకు డైరెక్ట్ ఎంట్రీ!
Also Read
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తమ 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయం లోగా పూర్తి చేయడంలో విఫలమైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ సంజూ శాంసన్కు రూ.24 లక్షల ఫైన్ విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ప్లేయింగ్ ఎలెవన్లోని మిగిలిన సభ్యులకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించింది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి కాబట్టి.. భారీ జరిమానా పడింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కూడా ఆర్ఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఆ మ్యాచ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
తాజావార్తలు
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!