AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
- ఏపీ లిక్కర్ స్కాం నిందితుల కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి..
- ఈ నెల 29న తీర్పు వెల్లడించనున్న ఏసీబీ కోర్టు..
- కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డిని 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్..
- ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను..
- వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్లు..
- నలుగుర్ని కలిపి విచారించాల్సిన అవసరం ఉందన్న ప్రభుత్వ న్యాయవాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తోంది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసింది సిట్. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో ఏ1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఏ31గా ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణమోహన్ రెడ్డి, ఏ34గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. వీరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు వెలుగుచూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజులు పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది దర్యాప్తు బృందం. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో కలిపి రాజ్ను విచారించాలని అప్పుడే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డిని మూడు రోజులు, మిగతా ముగ్గురు నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించింది. నలుగురు నిందితులను కలిపి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురు నిందితులను కలిపి విచారిస్తే కీలక విషయాలు బయట పడే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సీజ్ చేసిన ఫోన్లు, ఇతర మెటీరియల్ను కోర్టులో సబ్మిట్ చేయకుండా నేరుగా FSLకు పంపుతున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఆఫీసులో ఆడియో, వీడియో రికార్డు ఉందని కస్టడీకి ఇస్తే అక్కడకు పంపి ఆడియో, వీడియో రికార్డు చేయించాలని కోర్టును కోరారు. విచారణలో అడిగిన ప్రశ్నలు, విచారణ వివరాలు కోర్టుకు అందించాలని పిటిషనర్ న్యాయవాదులు కోరారు. దీంతో సీల్డ్ కవర్లో వివరాలు ఇవ్వాలని సిట్ను ఆదేశించింది ఏసీబీ కోర్టు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!