Minister Narayana: సూపర్ సిక్స్లో 90 శాతం అమలు చేసేశాం
- సూపర్ సిక్స్లో 90 శాతం అమలు చేసేశాం
- మంత్రి నారాయణ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ సిక్స్లో 90 శాతం అమలు చేసేశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు అనుగుణంగా స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందని తెలిపారు. స్వచ్ఛమైన తాగు నీరు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
Also Read
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
- AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. ఇప్పటికే సూపర్ సిక్స్లో 90 శాతం అమలు చేశామన్నారు. స్వచ్చంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ను ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటివరకూ 81 లక్షల టన్నుల చెత్త తొలగించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ అక్టోబర్ రెండో తేదీకి ముందుగానే 85 లక్షల టన్నుల వేస్ట్ను తొలగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాలతో మున్సిపాలిటీల్లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని.. రాష్ట్రంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయించినట్లు గుర్తుచేశారు. ఇప్పటికే ఉన్న రెండు ప్లాంట్లకు అదనంగా త్వరలో కొత్తగా ఆరు ప్లాంట్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ప్రతి రోజూ వచ్చే 7000 టన్నుల చెత్తలో 6500 టన్నుల చెత్త విద్యుత్గా మారిపోతుందన్నారు. అదే జరిగితే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: US: డల్లాస్లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటి నుంచి వచ్చే నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసి బయటకు పంపిస్తామన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ 100 శాతం స్వచ్ఛమైన తాగు నీరు కుళాయిల ద్వారా అందిస్తామని ప్రకటించారు. కార్పోరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పని చేస్తారని కోరుకుంటున్నట్లు నారాయణ చెప్పారు.
తాజావార్తలు
-
YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
-
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
-
US-Iran Peace Deal: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ టీమ్లో చీలిక.. CIA హెచ్చరికలతో ఉద్రిక్తత
-
G7 Summit: ప్రపంచ నేతల సదస్సులో ఒంటరిగా ట్రంప్.. ఫొటో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?