Nepal: లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు.. వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
- లగ్జరీ కార్లు.. విలాసవంతమైన భోగాలు
- వెలుగులోకి ప్రముఖుల పిల్లల చిత్రాలు
జెన్-జెడ్ ఉద్యమంతో నేపాల్ అల్లకల్లోలం అయింది. కనీవినీ ఎరుగని రీతిలో నేపాల్ రాజధాని ఖాట్మండు విధ్వంసానికి గురైంది. దేశంలో నాయకుల అవినీతి కారణంగా యువతలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలించింది. దీంతో జెన్-జెడ్ ఉద్యమం పేరుతో యువత చెలరేగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాధినేతల ఇళ్లు లక్ష్యంగా నిరసనకారులు చెలరేగిపోయారు. ధ్వంసం చేయడంతో పాటు ఆస్తులను తగలబెట్టేశారు. దీంతో ఆస్తులన్నీ మంటల్లో తగలబడిపోయాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీంతో దేశ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది.

Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
ఓ వైపు నేపాల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికంతో ప్రజలు విలవిలలాడుతుంటే ప్రముఖుల పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. విదేశీ యాత్రలకు వెళ్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పేదోళ్లు రక్తం చిందించి.. చెమటోడ్చి పన్నలు కడుతుంటే.. ప్రముఖుల పిల్లలు మాత్రం సుఖభోగాలు అనుభవిస్తూ దర్జాగా బ్రతుకుతున్నారు. ఇదే యువతలో ఆగ్రహాన్ని రగిలించింది.

తాజాగా ప్రముఖల ఇళ్లల్లో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లుగా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రుల పిల్లలు విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లుగా కనిపించింది. డిజైనర్ బ్యాగులు, లగ్జరీ కార్లు, విదేశీ యాత్రలు, ఆడంబరమైన జీవనశైలికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే నిరసనకారుల్లో అశాంతికి ఆజ్యం పోసింది. కడుపు మండిన ఆందోళనకారులు ప్రముఖుల ఇళ్లు లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. ఆస్తులన్నీ కాలి బుడిదయ్యాయి.
ఇది కూడా చదవండి: US: డల్లాస్లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై జెన్-జెడ్ ఉద్యమం సోషల్ మీడియాలో ఉధృతంగా సాగుతోంది. అయితే కేపీ శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఇది మరింత ఆగ్రహాన్ని రగిలించింది. అంతే ఉద్యమకారులంతా రోడ్డెక్కారు. దాదాపు 10 వేల మంది నిరసనకారులు ఒక్కసారిగా ఖాట్మండులో విధ్వంసం సృష్టించారు. మంత్రులను లక్ష్యంగా దాడులు చేశారు. దీంతో వణికిపోయిన ప్రభుత్వాధినేతలు పదవులకు రాజీనామా చేశారు. అలాగే ప్రధాని ఓలి కూడా రాజీనామా చేసి అదృశ్యమైపోయారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?