AP SSC 2025 Valuation: SSC వాల్యుయేషన్లో లోపాలు.. ఐదుగురిపై వేటు
- ఏపీలో SSC వాల్యుయేషన్ లోపాల కలకలం..
- రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం 66,363 దరఖాస్తులు..
- వాటిపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం..
- SSC వాల్యుయేషన్లో లోపాలు గుర్తింపు..
- ఐదుగురిని సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు..
AP SSC 2025 Valuation: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు SSC వాల్యుయేషన్ లోపాలు కలకలం సృష్టిస్తున్నాయి.. రికార్డుస్థాయిలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఏకంగా 66,363 దరఖాస్తులు వచ్చాయి.. దీంతో, వాటిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. SSC వాల్యుయేషన్లో లోపాలు గుర్తించింది సర్కార్.. దీనికి బాధ్యులైన ఐదుగురిని సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.. టెన్త్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో.. 66 వేలకు పైగా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి. దీంతో విద్యా శాఖ అలెర్ట్ అయింది.. 11 వేలకు పైగా స్క్రిప్టుల మార్కులలో లోపాలు గుర్తించారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో.. విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు.. గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై అంతర్జాతీయ నిపుణులు ఏం తేల్చారంటే..!
Also Read
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
- Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
మొత్తంగా SSC 2025 వాల్యుయేషన్ లో లోపాలు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది పాఠశాల విద్యాశాఖ.. తొలిసారిగా 5 మంది వాల్యుయేటర్లను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.. ఒక విద్యార్థినికి అన్ని సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు వచ్చి సోషల్ లో 23 రావడంతో రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకుంది.. రివాల్యుయేషన్ లో సోషల్ లో 96 మార్కులతో పాటు మొత్తం 575/600 రావడంతో మిగతా విద్యార్ధుల్లో ఆందోళన మొదలైంది.. తప్పులలో ప్రధానంగా టోటలింగ్ లోపాలు, మార్కులు సరిగ్గా OMR షీట్ లో నమోదు చేయకపోవడం, కొన్ని సమాధానాలను అసలు గుర్తించకపోవడంగా గుర్తించారు.. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా, ఈ లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది.. ఇక, తాజా RV/RC ఫలితాలను జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు..
తాజావార్తలు
-
AK47 : ఆదర్శ కుటుంబం’ టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
-
Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?