CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. విజన్ 2047 కోసం పనిచేస్తున్నా..
- స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను..
- విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు..
- ఇప్పుడు అర్థం అవుతోందన్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు.. కానీ, ఇప్పుడు అర్థం అవుతోందన్న ఆయన.. ఇప్పుడు తాను విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అన్నారు.. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్లోని 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యం.. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యం.. స్వామీజీ పై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన నాపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తాం.. అందరూ యదార్థములని కూడా చెప్పేలా ఉండాలి అన్నారు..
Read Also: BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఇక, ప్రతి ఒక్కరికీ స్పిరిచువాలిటీ ఉండాలి అన్నారు సీఎం చంద్రబాబు.. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలి.. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు.. నేను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని నా చేతికి ఇచ్చారు.. మంచికోసం స్వామీజీ పరితపిస్తారు.. స్వామీజీని ఎప్పుడు కలిసినా మనశ్శాంతి దొరుకుతుందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పీఠాధితుల ఆశీర్వచనం తీసుకున్నారు.. ఆ తర్వాత 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
Read Also: MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే..
మరోవైపు సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు గణపతి సచ్చిదానంద స్వామి .. కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను.. చంద్రబాబు ఒక కర్మ యోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం. చంద్రబాబుకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.. చంద్రబాబు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధి చేయటానికి, చంద్రబాబుకి సమయం ఇవ్వండి. చెడు చేయాలి అంటే వెంటనే చేయొచ్చు, మంచి చేయటానికి సమయం పడుతుందని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.. నిన్నటి వరకు మీ రాజ్యం ఏది అంటే, ఏమి చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి రాజధాని వచ్చింది. నా అమరావతి రాజధాని అని ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను అని వ్యాఖ్యానించారు గణపతి సచ్చిదానంద స్వామి..
తాజావార్తలు
-
Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
-
Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
-
Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్ఐఆర్ నమోదు!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
-
Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!