CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. విజన్ 2047 కోసం పనిచేస్తున్నా..
- స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను..
- విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు..
- ఇప్పుడు అర్థం అవుతోందన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు.. కానీ, ఇప్పుడు అర్థం అవుతోందన్న ఆయన.. ఇప్పుడు తాను విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అన్నారు.. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్లోని 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంపద సృష్టించినా ఆనందంగా ఉండటం ముఖ్యం.. ఆనందంగా ఉండాలంటే స్వామీజీల వల్ల సాధ్యం.. స్వామీజీ పై పెట్టిన నమ్మకంతో కొంత పాలకులైన నాపై పెడితే స్వర్ణాంధ్ర సాధిస్తాం.. అందరూ యదార్థములని కూడా చెప్పేలా ఉండాలి అన్నారు..
Read Also: BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఇక, ప్రతి ఒక్కరికీ స్పిరిచువాలిటీ ఉండాలి అన్నారు సీఎం చంద్రబాబు.. భగవంతుని ఆశీస్సులు మనకి ఉండాలి.. గణపతి సచ్చిదానంద ఆశీస్సులు తీసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు.. నేను కష్టాల్లో ఉన్నపుడు పూజ చేసి ఫలితాన్ని నా చేతికి ఇచ్చారు.. మంచికోసం స్వామీజీ పరితపిస్తారు.. స్వామీజీని ఎప్పుడు కలిసినా మనశ్శాంతి దొరుకుతుందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, విజయవాడ పటమటలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పీఠాధితుల ఆశీర్వచనం తీసుకున్నారు.. ఆ తర్వాత 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
Read Also: MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే..
మరోవైపు సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు గణపతి సచ్చిదానంద స్వామి .. కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను.. చంద్రబాబు ఒక కర్మ యోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం. చంద్రబాబుకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.. చంద్రబాబు ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధి చేయటానికి, చంద్రబాబుకి సమయం ఇవ్వండి. చెడు చేయాలి అంటే వెంటనే చేయొచ్చు, మంచి చేయటానికి సమయం పడుతుందని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.. నిన్నటి వరకు మీ రాజ్యం ఏది అంటే, ఏమి చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి రాజధాని వచ్చింది. నా అమరావతి రాజధాని అని ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను అని వ్యాఖ్యానించారు గణపతి సచ్చిదానంద స్వామి..
తాజావార్తలు
-
GT vs RCB: సిక్సర్ల సునామీ.. స్టేడియంలో ఆర్సీబీ శివతాండవం! గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 255 కొట్టాల్సిందే..
-
Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
-
Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
-
Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
-
Xiaomi Mijia: మార్కెట్ లోకి విద్యుత్ ఆదా చేసే కొత్త ఏసీ.. 3 నిమిషాల్లో అదిరిపోయే కూలింగ్! ధర ఎంతో తెలుసా ?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!