PVN Madhav Profile: పీవీఎన్ మాధవ్ నేపథ్యం ఇదే.. అరుదైన రికార్డు..!
- ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న పీవీఎన్ మాధవ్..
- ఉమ్మడి ఏపీలో బీజేపీ చీఫ్ గా పనిచేసిన మాధవ్ తండ్రి చలపతిరావు..
- తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన అరుదైన రికార్డు..!
PVN Madhav Profile: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది.. అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో, పార్టీ విధేయులకు బీజేపీ పెద్దపీట వేస్తోందని మరోసారి రుజువైంది.. దశాబ్దాలు తరబడి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు కట్టబెట్టుతోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను ఎంపిక చేసింది. రాష్ట్ర నేతలు ఒకటి తలిస్తే.. హైకమాండ్ మరొకటి చేస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ అధ్యక్షుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్లు, ఆశావహులకు షాకిస్తూ.. కొత్త అధ్యక్షులను ఎంపిక చేసింది.
Read Also: Kothapallilo Okappudu : డైరెక్టర్ గా మారిన కేర్ ఆఫ్ కంచరపాలెం నటి, నిర్మాత
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఇక, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు మాధవ్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసినట్లవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదో రికార్డు. మాధవ్ తండ్రి చలపతిరావు.. కాషాయ పార్టీకి తొలితరం నాయకుల్లో ఒకరు. ఆయన ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ సీనియర్ నేతలకు చలపతిరావు గురువులాంటి వారు.
Read Also: Kannappa: కన్నప్ప’లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?
పీవీఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగష్టు 10వ తేదీన.. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. మాధవ్ ఉన్నత విద్యావంతుడు. కాస్ట్ అకౌంటెంట్ కోర్సు చేశారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో MBA చదివారు. ఏకకాలంలో PGDCS, PGDAS పూర్తి చేశారు. ఆయన రాజకీయ ప్రయాణం అఖిల భారత్ విద్యార్థి పరిషత్తో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్లో చురుకుగా వ్యవహరించారు. విద్యార్ధి నాయకుడుగా కెరీర్ ప్రారంభించిన మాధవ్.. యువ మోర్చాలో విద్యార్ధి, సామాజిక అంశాలపై పోరాటం సాగించారు. ఆయన కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటు బీజేపీతో విడదీయరాని అనుబంధం ఉంది.
Read Also: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!
బీసీ సామాజిక వర్గానికి చెందిన పీవీఎన్ మాధవ్.. 2009లో తొలిసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2017లో టీడీపీ-బీజేపీ-జనసేన బలపరచడంతో… ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో… శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటులో మాధవ్ గెలుపు సాధ్యం అయింది. బీజేపీ ఫ్లోర్ లీడర్గానూ పని చేశారు. ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్.. పార్టీకి నమ్మకస్తుడు. మాధవ్ పేరు అధ్యక్ష పీఠం కోసం గతంలో పరిశీలించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ సారి ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత, బీసీ ఫ్యాక్టర్ వంటివి కలిసి వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అధ్యక్ష బాధ్యతలు చేపడితే తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే పార్టీకి సారధులుగా పనిచేసిన అరుదైన నేపథ్యం.
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!