Obulapuram Mining Case: టీడీపీ మాజీ నేతలను కలిపిన పాత కేసు.. ఒకే దగ్గరకు ఏపీ, తెలంగాణ నేతలు..
- రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి చేర్చిన పాత కేసు..
- విజయవాడ కోర్టుకు రెండు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు..
- టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి..
Obulapuram Mining Case: రాజకీయ పార్టీల్లో నేతల వలసలు కామన్.. కొందరు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కొనసాగితే.. మరికొందరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వారికి ఉన్న అవకాశాలతో కూడా పార్టీలు మారిన సందర్భాలు ఉంటాయి.. అయితే, వారినిపై నమోదైన కేసులు మాత్రం అంత తొందరగా వదలవు కదా..? కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది.. తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది. ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీలో ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు.
Read Also: Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్ టీజర్ వచ్చేసింది!
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
కొందరు మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రివర్యులు.. వివిధ పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు.. ప్రభుత్వాలలో కీలక భూమిక పోషిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, కోర్టుకు హాజరైన నేతల విషయానికి వస్తే.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నాగం జనార్దన్ రెడ్డి వీరంతా ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా ఉన్నారు.. చంద్రబాబు ఆదేశాలతో ఎన్నో పోరాటాలు చేశారు. కలిసిమెలిసి తిరిగారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీల్లోకి వలస పోగా, ఏపీ నేతలు మాత్రం ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వీరంతా మంగళవారం ఒక్కసారిగా కలిశారు. 2007లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైన కేసుకు సంబంధించి విచారణ ఉండటంతో అంతా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత నేతలు అంతా ఒకే చోట చేరడంతో కోర్టు ఆవరణ సందడిగా మారిపోయింది. ఆ నేతలు కూడా ఏ పార్టీలో ఉన్నా.. అంతా అప్యాయంగా పలకరించుకుంటూ మట్లాడుకున్నారు..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!