Obulapuram Mining Case: టీడీపీ మాజీ నేతలను కలిపిన పాత కేసు.. ఒకే దగ్గరకు ఏపీ, తెలంగాణ నేతలు..
- రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి చేర్చిన పాత కేసు..
- విజయవాడ కోర్టుకు రెండు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు..
- టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obulapuram Mining Case: రాజకీయ పార్టీల్లో నేతల వలసలు కామన్.. కొందరు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కొనసాగితే.. మరికొందరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వారికి ఉన్న అవకాశాలతో కూడా పార్టీలు మారిన సందర్భాలు ఉంటాయి.. అయితే, వారినిపై నమోదైన కేసులు మాత్రం అంత తొందరగా వదలవు కదా..? కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది.. తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది. ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీలో ఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు.
Read Also: Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్ టీజర్ వచ్చేసింది!
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
కొందరు మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రివర్యులు.. వివిధ పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు.. ప్రభుత్వాలలో కీలక భూమిక పోషిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, కోర్టుకు హాజరైన నేతల విషయానికి వస్తే.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నాగం జనార్దన్ రెడ్డి వీరంతా ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా ఉన్నారు.. చంద్రబాబు ఆదేశాలతో ఎన్నో పోరాటాలు చేశారు. కలిసిమెలిసి తిరిగారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నేతలు టీడీపీని వదిలి వేర్వేరు పార్టీల్లోకి వలస పోగా, ఏపీ నేతలు మాత్రం ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే వీరంతా మంగళవారం ఒక్కసారిగా కలిశారు. 2007లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైన కేసుకు సంబంధించి విచారణ ఉండటంతో అంతా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత నేతలు అంతా ఒకే చోట చేరడంతో కోర్టు ఆవరణ సందడిగా మారిపోయింది. ఆ నేతలు కూడా ఏ పార్టీలో ఉన్నా.. అంతా అప్యాయంగా పలకరించుకుంటూ మట్లాడుకున్నారు..
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!