Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు
- యనమలకుదురు శివాలయంలో హుండీ దోపిడీ కలకలం
- ఈఓ భవాని పాత్రపై వెలుగులోకి వచ్చిన వివరాలు
- సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దోపిడీ
- అర్చకులు అరెస్ట్.. ఈఓ పరారీలో విచారణ వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు ఆలయ ఈఓ (EO) భవాని సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఆలయ హుండీ తాళాలు సాధారణంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. అయితే, ఈఓ భవాని తన సిబ్బందిని పంపి ఆ తాళాలను తెప్పించేవారు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడు సాగర్, ఆయన సహాయకుడు పూర్ణ ఆ తాళాలకు మారుతాళాలు (Duplicate Keys) తయారు చేయించారు. హుండీ లెక్కింపు సమయంలో కాకుండా, ఇతర సమయాల్లో మారుతాళాలతో హుండీలు తెరిచి నగదును మాయం చేసేవారు.
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఆలయ మంటపంలోని 16 సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మరీ ఈ దోపిడీకి పాల్పడేవారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన కానుకలు ఈ విధంగా మాయమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, బ్యాంకులో నగదు జమ చేసే సమయంలో నోట్ల కట్టల్లో అదనపు నోట్లు పెట్టి, ఆ తర్వాత ఆ అదనపు సొమ్మును ఈఓ భవాని పక్కదారి పట్టించేవారని గుర్తించారు. ఆలయ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన అర్చకుడు సాగర్, సహాయకుడు పూర్ణ, , తాత్కాలిక ఉద్యోగి రోసయ్యలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈఓ భవాని ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై పరారీలో ఉన్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. చినిగిన నోట్లను గోనె సంచుల్లో వేసి ఒక గుమస్తా ఇంటికి తరలించిన వైనం కూడా పోలీసుల తనిఖీల్లో బయటపడింది.
తాజావార్తలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!