Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు
- యనమలకుదురు శివాలయంలో హుండీ దోపిడీ కలకలం
- ఈఓ భవాని పాత్రపై వెలుగులోకి వచ్చిన వివరాలు
- సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దోపిడీ
- అర్చకులు అరెస్ట్.. ఈఓ పరారీలో విచారణ వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు ఆలయ ఈఓ (EO) భవాని సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఆలయ హుండీ తాళాలు సాధారణంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. అయితే, ఈఓ భవాని తన సిబ్బందిని పంపి ఆ తాళాలను తెప్పించేవారు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడు సాగర్, ఆయన సహాయకుడు పూర్ణ ఆ తాళాలకు మారుతాళాలు (Duplicate Keys) తయారు చేయించారు. హుండీ లెక్కింపు సమయంలో కాకుండా, ఇతర సమయాల్లో మారుతాళాలతో హుండీలు తెరిచి నగదును మాయం చేసేవారు.
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఆలయ మంటపంలోని 16 సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మరీ ఈ దోపిడీకి పాల్పడేవారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన కానుకలు ఈ విధంగా మాయమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, బ్యాంకులో నగదు జమ చేసే సమయంలో నోట్ల కట్టల్లో అదనపు నోట్లు పెట్టి, ఆ తర్వాత ఆ అదనపు సొమ్మును ఈఓ భవాని పక్కదారి పట్టించేవారని గుర్తించారు. ఆలయ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన అర్చకుడు సాగర్, సహాయకుడు పూర్ణ, , తాత్కాలిక ఉద్యోగి రోసయ్యలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈఓ భవాని ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై పరారీలో ఉన్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. చినిగిన నోట్లను గోనె సంచుల్లో వేసి ఒక గుమస్తా ఇంటికి తరలించిన వైనం కూడా పోలీసుల తనిఖీల్లో బయటపడింది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!