Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు
- యనమలకుదురు శివాలయంలో హుండీ దోపిడీ కలకలం
- ఈఓ భవాని పాత్రపై వెలుగులోకి వచ్చిన వివరాలు
- సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దోపిడీ
- అర్చకులు అరెస్ట్.. ఈఓ పరారీలో విచారణ వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు ఆలయ ఈఓ (EO) భవాని సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఆలయ హుండీ తాళాలు సాధారణంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. అయితే, ఈఓ భవాని తన సిబ్బందిని పంపి ఆ తాళాలను తెప్పించేవారు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడు సాగర్, ఆయన సహాయకుడు పూర్ణ ఆ తాళాలకు మారుతాళాలు (Duplicate Keys) తయారు చేయించారు. హుండీ లెక్కింపు సమయంలో కాకుండా, ఇతర సమయాల్లో మారుతాళాలతో హుండీలు తెరిచి నగదును మాయం చేసేవారు.
Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఆలయ మంటపంలోని 16 సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మరీ ఈ దోపిడీకి పాల్పడేవారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన కానుకలు ఈ విధంగా మాయమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, బ్యాంకులో నగదు జమ చేసే సమయంలో నోట్ల కట్టల్లో అదనపు నోట్లు పెట్టి, ఆ తర్వాత ఆ అదనపు సొమ్మును ఈఓ భవాని పక్కదారి పట్టించేవారని గుర్తించారు. ఆలయ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన అర్చకుడు సాగర్, సహాయకుడు పూర్ణ, , తాత్కాలిక ఉద్యోగి రోసయ్యలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈఓ భవాని ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై పరారీలో ఉన్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. చినిగిన నోట్లను గోనె సంచుల్లో వేసి ఒక గుమస్తా ఇంటికి తరలించిన వైనం కూడా పోలీసుల తనిఖీల్లో బయటపడింది.
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!